News March 18, 2024

శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ సోమవారం పరిశీలించారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయా గదుల్లో తిరుగుతూ.. పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు. విద్యార్థుల హాజరును కలెక్టర్ ఆరా తీశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఎలాంటి పొరపాట్లకు తావివొద్దన్నారు.

Similar News

News January 22, 2026

అరసవెల్లి: రథసప్తమికి దర్శన టోకెన్ల ధరలు ఇలా..!

image

అరసవెల్లి దేవస్థానంలో ఈ నెల 24న జరగనున్న రథసప్తమి ఉత్సవాలలో భక్తులు దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు వివరాలు ఇలా ఉన్నాయి. ఉచిత దర్శనం, రూ.100 దర్శనం, రూ.300, వీఐపీ దర్శనాలు కోసం ఒక్కోదానికి రెండు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. వీవీఐపీ దర్శనాలను ఉత్తర ద్వారం ద్వారా పంపించి ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుంచి మీడియా పాయింట్ వద్దకు చేరుకునేలా ఏర్పాటు చేశారు.

News January 22, 2026

అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలలో నేటి కార్యక్రమాలు.!

image

అరసవెల్లిలో సప్తాహ్ ఉత్సవాల్లో భాగంగా నేడు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అరసవెల్లి ఆలయంలో ఉత్సవ మూర్తులకు లక్ష పుష్పార్చన సేవ జరగనుంది. డచ్ బంగ్లా వద్ద ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెలీ రైడ్, బెలూన్ రైడ్‌లు ఏర్పాటు చేశారు. కేఆర్ స్టేడియంలో సాయంత్రం ఫుడ్ ఎగ్జిబిషన్, కిడ్స్ ప్లే, నృత్యాలు, మిమిక్రీ, గోరటి వెంకన్న కార్యక్రమంల ‘శ్రీనివాస కళ్యాణం’నాటిక జరుగుతుంది.

News January 22, 2026

SKLM: ఈ నెల 23న కబడ్డీ పోటీలు ప్రారంభం

image

రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 23న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించనున్నారు. వివిధ జిల్లాల నుంచి జట్లు ఈ ఆటల్లో తలపడనున్నాయి. శనివారం కబడ్డీ ఫైనల్స్ పాటు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే వెయిట్ లిఫ్టింగ్, కర్రసాము, సంగీడులు, ఉలవబస్తాల పోటీలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు పోటీలు మొదలవనున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాభిమానులు తరలిరావాలని అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.