News March 26, 2024

ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాసులురెడ్డి?

image

AP: ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డినే బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలుత ఈ స్థానానికి శ్రీనివాసులు రెడ్డితో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా TDP పరిశీలించింది. అయితే తన తండ్రే పోటీ చేస్తారని రాఘవరెడ్డి నిన్న ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తీవ్రత పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రాఘవ ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు.

Similar News

News November 18, 2025

షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్ అక్రమ లావాదేవీలు

image

ఢిల్లీ బాంబు పేలుళ్లతో లింకు ఉన్న అల్ ఫలాహ్ వర్సిటీలో జరిగిన సందేహాస్పద ఆర్థిక లావాదేవీలపై ED దర్యాప్తు చేపట్టింది. JeMతో లింకులున్న బాంబర్ ఉమర్ సహా నిందితులు ఈ వర్సిటీకి సంబంధించిన వారే. 25 ప్రాంతాల్లో ED తనిఖీలు చేసింది. షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ తదితర ఆర్థిక అక్రమాలపై విచారిస్తోంది. వర్సిటీ కీలక వ్యక్తుల లావాదేవీలనూ పరిశీలిస్తోంది. 9 షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్‌కు లింకులున్నట్లు గుర్తించారు.

News November 18, 2025

షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్ అక్రమ లావాదేవీలు

image

ఢిల్లీ బాంబు పేలుళ్లతో లింకు ఉన్న అల్ ఫలాహ్ వర్సిటీలో జరిగిన సందేహాస్పద ఆర్థిక లావాదేవీలపై ED దర్యాప్తు చేపట్టింది. JeMతో లింకులున్న బాంబర్ ఉమర్ సహా నిందితులు ఈ వర్సిటీకి సంబంధించిన వారే. 25 ప్రాంతాల్లో ED తనిఖీలు చేసింది. షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ తదితర ఆర్థిక అక్రమాలపై విచారిస్తోంది. వర్సిటీ కీలక వ్యక్తుల లావాదేవీలనూ పరిశీలిస్తోంది. 9 షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్‌కు లింకులున్నట్లు గుర్తించారు.

News November 18, 2025

పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: తిరుమల పరకామణి కేసులో నిందితుడు రవికుమార్‌తో పాటు సాక్షులకు భద్రత కల్పించాలని సీఐడీ డీజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల విచారణకు హాజరైన టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ అనుమానాస్పద స్థితిలో మరణించిన నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. కాగా సతీశ్ మృతి కేసును తాజాగా హత్య కేసుగా నమోదుచేసిన విషయం తెలిసిందే.