News August 10, 2025
‘సృష్టి’ కేసు.. రంగంలోకి ఈడీ

TG: ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ED రంగంలోకి దిగింది. ఇందులో మనీలాండరింగ్ కూడా జరిగిందని, కేసు వివరాలు ఇవ్వాలని పోలీసులకు లేఖ రాసింది. ప్రధాన నిందితురాలు డా.నమ్రత 8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించి, చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడినట్లు గుర్తించారు. 80 మంది పిల్లలను విక్రయించి సుమారు రూ.25 కోట్లు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ డబ్బును విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు భావిస్తున్నారు.
Similar News
News August 10, 2025
ముగిసిన ‘ఆడుదాం ఆంధ్ర’ స్కామ్ విచారణ

AP: గత ప్రభుత్వ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో జరిగిన స్కామ్పై విచారణ ముగిసింది. ఇందుకు సంబంధించిన రిపోర్టును త్వరలో విజిలెన్స్ అధికారులు డీజీపీకి సమర్పించనున్నారు. కాగా ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో స్పోర్ట్స్ కిట్స్, ఈవెంట్స్ పేరిట అవినీతి జరిగిందనే ఆరోపణలతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
News August 10, 2025
18 ఏళ్లు దాటాయా? అయితే..

ఇటీవల 30 ఏళ్లలోపు యువతలోనూ గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఆడుతూ, జిమ్, డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోతున్నారు. జన్యుపరమైన కారణాలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు, సిగరెట్, మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం కూడా గుండెపోటు మరణాలకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
News August 10, 2025
పంచాయతీ ఎన్నికలు.. BIG UPDATE

TG: పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్న రూల్ను రద్దు చేసే ఛాన్సున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ చట్టం-2018 సెక్షన్ 21(3)ని తొలగించే ప్రతిపాదనను క్యాబినెట్ ముందు ఉంచనున్నట్లు చర్చ మొదలైంది. BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ఈ మార్పు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.