News March 18, 2025

నేడు శ్రీవారి అర్జితసేవా టికెట్ల కోటా విడుదల

image

శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించి జూన్ నెల టికెట్ల లక్కీడీప్ కోటాను TTD ఈరోజు ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో టికెట్లు దక్కిన భక్తులు ఈ నెల 20-22 తేదీల మధ్యలో పేమెంట్ పూర్తి చేసి టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం గదుల కోటాను విడుదల చేయనుంది.

Similar News

News October 13, 2025

సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పదోన్నతుల కల్పనపై అధ్యయనం చేసేందుకు 10 మంది మినిస్టర్లతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, నారాయణ, DSBV స్వామి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, గొట్టిపాటి రవి కుమార్, సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.

News October 13, 2025

టాటా మెమోరియల్ సెంటర్‌లో 78 ఉద్యోగాలు

image

టాటా మెమోరియల్ సెంటర్‌ హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ (పంజాబ్)‌లో 78 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ, అంకాలజీ నర్సింగ్ డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌తో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. https://tmc.gov.in/

News October 13, 2025

గొడవైందా? మరి ఆ తర్వాత..

image

గొడవల్లేకుండా ఏ బంధం ఉండదు. ముఖ్యంగా దంపతుల మధ్య కలహాలు సాధారణం. అయితే వీటి వల్లే ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోవడం, ఆ బంధం స్ట్రాంగ్‌గా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా గొడవైన తర్వాత భాగస్వామి వెంటనే సారీ చెప్పాలని ఆశించకండి. వారికి ఆలోచించుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలి. ఒకరినొకరు నిందించుకోకూడదు. అలాగే గొడవ ఎందుకు జరిగింది, ఆ సమయంలో ఎవరు ఎలా ప్రవర్తించారు అన్నవి కూడా చర్చించుకోవాలి.