News October 8, 2024

శ్రీవారి గరుడోత్సవం.. 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం

image

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం నేడు జరగనుంది. దాదాపు 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో RTC బస్సులలో వారిని కొండపైకి తరలించేందుకు TTD అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టూవీలర్స్, టాక్సీలను కొండపైకి నిషేధించారు. కాగా గరుడు వాహన సేవ సా.6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.

Similar News

News March 19, 2026

నేడే జాబ్ క్యాలెండర్.. 5 శాఖల్లో 8,340 పోస్టులు!

image

AP: రాష్ట్ర ప్రభుత్వం నేడు 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఇందులో 5 శాఖల్లోనే 8,340 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా విద్యాశాఖలో 4,500 పోస్టులు ఉన్నాయని సమాచారం. వర్సిటీల్లో 1,500, DSC, ఇతర పోస్టులు 3 వేలు, హోంశాఖలో 3 వేలు, ఎక్సైజ్ శాఖలో 450 ఉద్యోగాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో 4 దశల్లో వీటిని భర్తీ చేసే అవకాశం ఉంది. మంత్రి లోకేశ్ ఈ క్యాలెండర్‌ను రిలీజ్ చేయనున్నారు.

News March 19, 2026

కొత్త డీజీపీ రేసులో ముగ్గురు!

image

TG: డీజీపీ నియామకానికి అర్హులైన ముగ్గురు అధికారుల లిస్టు రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. సీవీ ఆనంద్(1991 బ్యాచ్), వినయ్ ప్రభాకర్ ఆప్టే(1994 బ్యాచ్), సౌమ్యా మిశ్రా(1994 బ్యాచ్)తో కూడిన ఫైనల్ లిస్టును యూపీఎస్సీ పంపింది. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీవీ ఆనంద్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డీజీపీ శివధర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ 30తో ముగియనుంది.

News March 19, 2026

ALERT: ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని APSDMA హెచ్చరించింది. శ్రీకాకుళం, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, NLR, కర్నూలు, నంద్యాల, ATP, సత్యసాయి, కడప, చిత్తూరు, TPTYలో తేలికపాటి-మోస్తరు వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. కాగా చిత్తూరు, కడపలోని పలు ఏరియాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది.