News April 24, 2024
రేపు ఉ.10 గంటలకు శ్రీవారి టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 కోటా) టికెట్లను టీటీడీ రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. అలాగే జులై నెలకు సంబంధించి తిరుమల, తిరుపతిలో వసతి కోటా టికెట్లను కూడా ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. అటు వృద్ధులు, వికలాంగుల కోటా టికెట్లు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యాయి.
Similar News
News December 26, 2025
అరటి తోటల్లో కలుపు నివారణ ఎలా?

అరటి తోటల్లో కలుపు నివారణ చాలా ముఖ్యం. దీని కోసం హెక్టారుకు 500 లీటర్ల నీటిలో బుటాక్లోర్ 5లీటర్లు లేదా అలాక్లోర్ 2.5లీటర్ లేదా పెండిమెథాలిన్ 2.5లీటర్లలో ఏదో ఒక మందును కలిపి నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేయాలి. దీని వల్ల కలుపు మొలవకుండా అరికట్టవచ్చు. 100 మైక్రానుల మందం కలిగిన పాలిథీన్ మల్చింగ్ షీటును నేలపై పరచి ఆ తర్వాత మొక్కనాటితే కలుపు సమస్యను అధిగమించవచ్చు.
News December 26, 2025
ఈ రాత్రి ఢిల్లీకి సీఎం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు CWC సమావేశంలో పాల్గొననున్నారు. ఎల్లుండి హైకమాండ్ పెద్దలతో భేటీ కానున్నారు. అందులో క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నట్లు సమాచారం.
News December 26, 2025
NABARD 44 పోస్టులకు నోటిఫికేషన్

<


