News February 15, 2025

SRPT: ఎక్కడ చూసినా అదే చర్చ..!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News October 17, 2025

MBNR: రూ.100 కోట్ల ‘PM–USHA’ పనులు వేగవంతం- VC

image

పీయూలో ఇంజినీరింగ్ కళాశాల,లా కళాశాల, కొత్త హాస్టళ్లు, పరిశోధన కేంద్రాలు వంటి ప్రాజెక్టులు రూ.100 కోట్ల PM–USHA పథకం కింద వేగంగా అభివృద్ధి చెందుతుందని వీసీ ఆచార్య డాక్టర్ జిఎన్.శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఐదు క్యాంపస్ కళాశాలలు, 3 పీజీ సెంటర్లు, 24 కోర్సులు కొనసాగుతున్నాయని, NSS, క్రీడా, పర్యావరణ, సాంస్కృతిక రంగాల్లో విద్యార్థుల చురుకైన భాగస్వామ్యాన్ని’ ప్రశంసించారు.

News October 17, 2025

బీబీనగర్ ఎయిమ్స్‌.. సీఎంకు దత్తాత్రేయ లేఖ

image

బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ క్యాంపస్‌ను రవాణా, ఇతర మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇది ప్రధాని మోదీ ఇచ్చిన బహుమతి అని, తెలంగాణలో వైద్య సేవలను బలోపేతం చేయడానికి ఎయిమ్స్‌ అభివృద్ధి అత్యవసరమన్నారు. రాజకీయాలకు అతీతంగా, సహకార సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు.

News October 17, 2025

పొగమంచు.. వాహనాలు నడిపే వారు జాగ్రత్త!

image

తెలుగు రాష్ట్రాల్లో చలికాలం మొదలైంది. చాలాచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా, కొన్నిచోట్ల పొగమంచు ఏర్పడుతోంది. తెల్లవారుజామున పొగమంచు కురుస్తుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కార్లు, బైకులు, ఇతర వాహనాలు నడిపేవారు ఈ సమయంలో నిదానంగా వెళ్లడం మేలు. అలాగే పాటు ఫాగ్‌లైట్స్, బీమ్ హెడ్‌లైట్స్ ఉపయోగించాలని, ఓవర్‌టేక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.