News February 13, 2025
SRPT: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. బరిలో ఎక్కువమంది పోటీ పడుతుండడంతో ఎన్నిక రసవత్తరం కానుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
Similar News
News December 12, 2025
వరంగల్: ఎనిమిది మందికి ఎస్సైలుగా పదోన్నతి

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఏఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మందికి ఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో యాదగిరి, సుదర్శన్, కృష్ణమూర్తి, అజీద్దున్, రవీంద్రచారి, ఉప్పలయ్య, సారంగపాణి, రాజేశ్వరి ఉన్నారు.
News December 12, 2025
ఎయిర్ పోర్టుల్లో సాంకేతిక సమస్యలను నివారించాలి: ఎంపీ మహేష్

గత నెల నవంబర్ 6న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఆటోమేషన్ సిస్టంలో సమస్య ఏర్పడిన విషయాన్ని ఏలూరు ఎంపీ మహేష్ పార్లమెంటులో శుక్రవారం ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో ప్రస్తుతం ఉన్న IP- ఆధారిత ఆటోమేటిక్ మెసేజ్ సెర్చింగ్ సిస్టం స్థానంలో కొత్త ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ మెసేజ్ హ్యాండ్లింగ్ సిస్టంను ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నారు.
News December 12, 2025
8 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ రెండవ విడత ఎన్నికలు ఈ నెల 14న ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదిలాబాద్ గ్రామీణం, మావల, బేలా, జైనథ్, సాత్నాల, భోరాజ్, తాంసీ, భీంపూర్ మండలాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలన్నారు. మద్యం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు.


