News January 26, 2025
SRPT: కలెక్టరేట్లో జెండా ఎగరవేసిన పాలనాధికారి

సూర్యాపేట కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ వివిధ శాఖల అధికారులతో కలిసి జాతీయ జెండా ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. బ్రిటిష్ వారి బానిస సంకెళ్ల నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొంది గణతంత్ర రాజ్యంగా అవతరించిందన్నారు. స్వాతంత్య్రోద్యమంలో యోధుల త్యాగాలను, వారి ఆశయాలను గుర్తు చేశారు. అదనపు కలెక్టర్ రాంబాబు ఉన్నారు.
Similar News
News November 3, 2025
కురుమూర్తి జాతరలో ఆకతాయిల ఆగడాలు

కురుమూర్తి జాతరలో ఆకతాయిల దుశ్చర్యలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారీగా భక్తులు తరలివస్తుండగా కొందరు యువతులు, మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు మద్యం, మాంసం దుకాణాలు తెరిచి ఉండడంతో మత్తులో హంగామాలు సృష్టిస్తున్నారు. రద్దీని ఆసరాగా చేసుకుని జేబుదొంగలు మొబైల్ ఫోన్లు, ఆభరణాలు అపహరిస్తున్నారు. పోలీసులు నిఘా పెంచాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
News November 3, 2025
వరల్డ్ కప్ విన్.. BJP&కాంగ్రెస్ శ్రేణుల ఫైట్

ప్రధాని మోదీ హాజరైతే అందులో భారత్కు ఓటమి తప్పదని కాంగ్రెస్ శ్రేణులు ట్వీట్లు చేస్తున్నాయి. ‘మోదీ హాజరైన చంద్రయాన్-2 & 2023 క్రికెట్ ప్రపంచకప్లో భారత్ విఫలమైంది. అదే మోదీ గైర్హాజరైన చంద్రయాన్-3, 2024 T20 WC, 2025 WWC వంటి వాటిలో భారత్ గెలిచింది. అంటే మోదీ హాజరుకు, వైఫల్యానికి సంబంధం ఉంది’ అని సెటైర్ వేస్తున్నాయి. రాహుల్ గాంధీ ఉండటం వల్లే కాంగ్రెస్ ఓడిపోతోందని బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.
News November 3, 2025
బస్సు ప్రమాదం.. పటాన్ చెరు నుంచి వెళ్లిన టిప్పర్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద ఆర్టీసి బస్సు ప్రమాదంలో 24 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణమైన టిప్పర్ పటాన్ చెరు లక్డారం క్రషర్ నుంచి బయలుదేరినట్లు సమాచారం. గత కొన్ని రోజుల కింద జరిగిన కర్నూల్ బస్సు ప్రమాదం కూడా ట్రావెల్స్ బస్సు పటాన్ చెరు నుంచి బయలుదేరిందని, పటాన్ చెరు నుంచి బయలుదేరే వాహనాలు మృత్యువును వెంటాడుతున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.


