News April 6, 2025
SRPT: కారు ఢీకొనడంతో.. యువతి మృతి

సూర్యాపేట జిల్లా రాయినిగూడెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పిల్లలమర్రి గ్రామానికి చెందిన దాసరి విజిత(23) మృతి చెందారు. మృత్యురాలు 7R హోటల్లో పని చేయడానికి వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వేగంగా వెళ్తున్న కారు ఆమెను ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు.
Similar News
News October 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 49 సమాధానాలు

1. శ్రీరామదాసుగా ప్రసిద్ధి చెందిన భక్తుడు ‘కంచర్ల గోపన్న’.
2. భూలోకానికి పైన ఉండే మొదటి లోకం ‘భువర్లోకం’.
3. రామసేతు నిర్మాణంలో ప్రధాన ఇంజినీర్లు ‘నల-నీల’ అనే ఇద్దరు వానరులు.
4. యుద్ధాన్ని చూస్తూ దాన్ని ధృతరాష్ట్రునికి వివరించింది ‘సంజయుడు’.
5. శివుడు తన జటాజూటంలో బంధించిన నది ‘గంగ’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 28, 2025
ALLERT: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ‘మొంథా తుఫాన్’

మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. శిథిలావస్థ భవనాలు, పాఠశాలల్లో ఎవరూ లేకుండా చూడాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, తీగల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ అధికారులు సూచించారు.
News October 28, 2025
కామారెడ్డి: పోలీసుల నిర్లక్ష్యం.. సస్పెన్షన్

పాస్పోర్ట్ విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం సస్పెండ్ చేసినట్లు తెలిపారు. డీఎస్బీ విభాగంలో పనిచేసిన భిక్నూర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎఎస్ఐ నర్సయ్య, రామారెడ్డి స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిపై ఇన్ఛార్జ్ డీఐజీ సన్ప్రీత్ సింగ్ సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతారాహిత్యానికి పోలీసు శాఖలో స్థానం లేదని ఎస్పీ తెలిపారు.


