News September 14, 2024

SRPT: కొడుకును హత్య చేసిన తండ్రి అరెస్ట్: డీఎస్పీ

image

మద్యానికి బానిసై తరచూ వేధిస్తున్న కొడుకును తండ్రి హత్య చేసిన ఘటనలో తండ్రి పంతులను రిమాండ్‌కు పంపినట్లు సూర్యాపేటలో DSP రవి తెలిపారు. ఆత్మకూర్ (ఎస్) మండలం బాపూజీతండాకు చెందిన బాణోత్ కిరణ్ ఈ నెల 11న రాత్రి మద్యం తాగి వచ్చిన కిరణ్ తండ్రితో ఘర్షణకు దిగి దాడి చేశాడు. ఆవేశానికిలోనైన తండ్రి గొడ్డలితో కిరణ్‌ను హత్య చేసినట్లు తెలిపారు. గ్రామీణ సీఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐ సైదులు అన్నారు.

Similar News

News December 17, 2025

నల్గొండ జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం

image

నేరేడుగొమ్ము మండల పరిధిలోని 21 గ్రామపంచాయతీలకు సర్పంచ్ ఎలక్షన్లు ప్రశాంతంగా ముగిశాయి. చిన్నమునిగల్ గ్రామపంచాయతీలో మొదటి ఫలితం వెలువడింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఇస్లావత్ వెంకటేశ్వర్లు విజయం సాధించారు. ఆయన బాబుపై 102 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

News December 17, 2025

నల్గొండ: ఆ గ్రామ పంచాయతీల్లో దంపతులదే హవా..!

image

తిప్పర్తి మండలంలోని 4 గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో దంపతుల హవా కొనసాగింది. రెండో దశ ఎన్నికల్లో 2019లో సోమోరిగూడెంలో కోన రజిత గెలవగా, ప్రస్తుతం ఆమె భర్త కోన వెంకన్న, రామలింగాల గూడెంలో ముత్తినేని శ్రీదేవి, ప్రస్తుతం ఆమె భర్త శ్యాంసుందర్, ఎర్రగడ్డలగూడెంలో ఎల్లాంల శైలజ, ప్రస్తుతం ఆమె భర్త సతీష్ రెడ్డి, జొన్నలగడ్డ గూడెంలో నామిరెడ్డి వెంకటరామిరెడ్డి, ప్రస్తుతం ఆయన భార్య అనురాధ విజయం సాధించారు.

News December 17, 2025

నల్గొండ: ఓట్ల కోసం నోట్ల వరద.. రూ.కోట్లలో ఖర్చు

image

నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం హద్దులు దాటిందని ప్రజలు అంటున్నారు. ఓటుకు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. చిన్న పంచాయతీల్లో రూ.20 లక్షలకు పైగా ఖర్చు చేయగా, కీలక పంచాయతీల్లో అభ్యర్థులు రూ.కోటికి మించి పంపిణీ చేశారన్నారు. గెలిచినవారితో పాటు ఓడినవారు కూడా ఖర్చును తలచుకుని మదనపడుతున్నారు. క్రాస్ ఓటింగ్‌తో లెక్కింపు ఉత్కంఠగా మారింది.