News March 31, 2025
SRPT: గ్రామాల్లో జోరుగా పైరవీలు..?

జిల్లావ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్ట్ను ఫైనల్ చేయలేదు. ఉమ్మడి జిల్లాకు 4,27,542 ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని అధికారపార్టీకి చెందిన చోటామోటా నాయకులు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని జోరుగా పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. అసలైన అర్హులు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నారు.
Similar News
News April 21, 2025
MBNR: ‘చెరువులలో పూడికతీత చేపట్టాలి’

జిల్లాలోని చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు చేపట్టాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ కోరారు. సోమవారం కలెక్టరేట్లో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. పూడికతీత పనులు చేపట్టడం ద్వారా చెరువులు, కుంటలలో నీరు ఎక్కువగా నిలిచి చేపల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. చేపల వేట, విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.
News April 21, 2025
ధర్మవరానికి రండి.. UP సీఎంకు మంత్రి ఆహ్వానం

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ధర్మవరం పట్టు వస్త్రం, నిమ్మలకుంట కళాకారులు తయారు చేసిన శ్రీకృష్ణుడి తోలుబొమ్మను సీఎంకు అందజేశారు. వీటి విశిష్టతను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ధర్మవరానికి రావాలని కోరగా తన ఆహ్వానాన్ని సీఎం స్వీకరించారని మంత్రి తెలిపారు.
News April 21, 2025
రేపు ఇంటర్ రిజల్ట్స్.. మేడ్చల్లో వెయిటింగ్

రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన మేడ్చల్ జిల్లాలో 150 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇంటర్ ఫస్టియర్లో 71,286 విద్యార్థులకు 69,842 మంది పరీక్ష రాశారు. సెకండియర్లో 63,946 విద్యార్థులకు 62,969 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం రేపు తేలనుంది. ఇంటర్ ఫలితాలను <<16170006>>Way2News<<>>లో చెక్ చేసుకోండి.
SHARE IT