News April 10, 2025
SRPT: త్వరలో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు

NLG రీజియన్కు ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. తొలిసారి కాలుష్య రహిత సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్లు రోడ్లపైకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ మార్పులు చేస్తూ ప్రయాణికులను పెంచుకునే పనిలో నిమగ్నమైంది. ఇంధనం ఖర్చు తగ్గించుకుని ఈ బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. సూర్యాపేట డిపోకు 75 బస్సులు కేటాయించారు.
Similar News
News November 24, 2025
KMR: శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో చట్టం చేయాలి:DSP

42% బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటోంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలేనని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్లో జరిగిన కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఇరు పార్టీలు చర్చించి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
News November 24, 2025
బీజేపీ ‘మిషన్ బెంగాల్’.. టార్గెట్ 160

బిహార్లో భారీ విజయం సాధించిన BJP ఫోకస్ను బెంగాల్ వైపు మళ్లించింది. 2026 ఎన్నికల్లో 160+ సీట్లే లక్ష్యంగా వ్యూహం రచిస్తోంది. TMCకి క్షేత్రస్థాయి కార్యకర్తల సపోర్ట్ను బ్రేక్ చేయాలని, మమత అల్లుడు అభిషేక్ బెనర్జీని వ్యతిరేకించే వారిని తమవైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తోంది. వారసత్వ రాజకీయం, అక్రమ ఓట్లపై టార్గెట్ చేయాలని చూస్తోంది. హిందూ ఓట్లు పోలరైజ్ చేయాలని నిర్ణయించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి.
News November 24, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓రేపు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం: కలెక్టర్
✓పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు
✓అశ్వరావుపేట: భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
✓దుమ్ముగూడెం: కల్వర్టును ఢీకొని యువకుడు మృతి
✓పోలీస్ వాహనాలు కండిషన్లో ఉంచాలి: ఎస్పీ
✓చర్లలో ఐదు రోజులు కరెంట్ కట్
✓కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ వెనక్కి తీసుకోవాలి: కార్మిక సంఘాలు
✓గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ


