News April 10, 2025

SRPT: త్వరలో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు

image

NLG రీజియన్‌కు ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్నాయి. తొలిసారి కాలుష్య రహిత సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌లు రోడ్లపైకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ మార్పులు చేస్తూ ప్రయాణికులను పెంచుకునే పనిలో నిమగ్నమైంది. ఇంధనం ఖర్చు తగ్గించుకుని ఈ బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. సూర్యాపేట డిపోకు 75 బస్సులు కేటాయించారు.

Similar News

News November 28, 2025

వరంగల్: క్వార్టర్లకు పెరిగిన డిమాండ్!

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు మద్యం కిక్కు మొదలైంది. కొత్త షాపులు డిసెంబరు 1 నుంచి ప్రారంభం అవుతుండగా, ప్రస్తుత షాపులకు నేటి నుంచి మద్యం సరఫరా బంద్ చేశారు. మరోపక్క గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. రోజూ మందు, ముక్క క్యాంపులు మొదలయ్యాయి. ఎవరు పోటీ చేయాలనే దగ్గరి నుంచి పూర్తయ్యే వరకు మందుకు డిమాండ్ ఎక్కువ్వడం కామనే. వైన్ షాపుల్లో క్వార్టర్లు లేకపోవడంతో, వాటి కోసం అశావహులు వేట మొదలు పెట్టారు.

News November 28, 2025

MBNR: కొనసాగుతున్న చలి తీవ్రత

image

మహబూబ్ నగర్ జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. జిల్లాలో అత్యల్పంగా మిడ్జిల్ మండలం దోనూరులో 13.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 14.1, రాజాపూర్ 14.4, మిడ్జిల్ మండలం కొత్తపల్లి, భూత్పూర్ 14.9, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.0, హన్వాడ 15.1, మిడ్జిల్ 15.2, మూసాపేట 15.5, మహమ్మదాబాద్ 15.7, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 15.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

News November 28, 2025

ADB: బార్డర్లపై ఫోకస్ పెడితే బెటర్..!

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికారులంతా మహారాష్ట్ర బార్డర్లపై దృష్టిసారించాల్సిన అవసరముంది. ఎందుకంటే అక్కడి నుంచే అక్రమ మద్యం ADBలోకి తీసుకొచ్చే ఆస్కారముంది. అక్కడ అక్కడ తక్కువ ధరకు దొరికే దేశీదారును అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంచే అవకాశముంది. తలమడుగు, తాంసి, బేల, భీంపూర్, భైంసా, కుబీర్, జైనథ్, చింతలమానేపల్లి ఇలా సరిహద్దు మండలాల్లో చెక్‌పోస్టులు, తనిఖీలు పెంచాలి.