News January 28, 2025
SRPT: దివ్యాంగ మహిళ పూలమ్మకు న్యాయం జరిగేనా!

మోతె మండలంలోని నామవారం శివారులో 7 ఎకరాల 10 గుంటల భూమిని మోతె తహశీల్దార్ సంఘమిత్ర అక్రమంగా పట్టా చేశారని దివ్యాంగ మహిళ పూలమ్మ ఆరోపించిన సంగతి తెలిసింది. ఆధారాలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆమె నిరసన తెలుపుతున్నారు. ఆమెకు న్యాయం జరగాలని పలువురు కోరుకుంటున్నారు.
Similar News
News February 17, 2025
విజయనగరం: ఆమె జీబీఎస్తో చనిపోలేదు..!

విశాఖ KGHలో ఓ వృద్ధురాలు గుండెపోటుతో చనిపోయిందని సూపరింటెండెంట్ శివానంద్ చెప్పారు. ‘విజయనగరం(D) L.కోట మండలానికి చెందిన వృద్ధురాలు(63) గుయిలెయిన్-బారే సిండ్రోమ్(జీబీఎస్) అనుమానాస్పద లక్షణాలతో ఫిబ్రవరి 6న KGHలో చేరారు. ఆమెకు షుగర్, బీపీ ఉన్నాయి. మేం అందజేసిన చికిత్సతో కాస్త కోలుకున్నారు. ఇవాళ ఛాతీ నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో చనిపోయినట్లు తేలింది. ఆమె GBSతో చనిపోలేదు’అని ఆయన తెలిపారు.
News February 17, 2025
ముస్లింలను తొలగిస్తేనే ఆమోదిస్తాం: బండి సంజయ్

TG: రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో కూలుతుందో తెలియడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మంత్రులు 15% కమీషన్ దండుకుంటున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని ఆరోపించారు. ముస్లింలను BCల జాబితా నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. కులగణన బిల్లు అలాగే పంపుతామంటే తామెందుకు ఆమోదిస్తామని, ముస్లింలను BCల జాబితా నుంచి తొలగించి పంపితే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.
News February 17, 2025
నా జీవితంలో అదే బెస్ట్ మూమెంట్: RCB కెప్టెన్

IPL మెగా వేలంలో ఫ్రాంచైజీ తనను కొనగానే టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ‘హలో ఐ యామ్ కోహ్లీ’ అంటూ మెసేజ్ చేసి అభినందించారని RCB కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపారు. అదే తన జీవితంలో బెస్ట్ మూమెంట్ అని పేర్కొన్నారు. ఆ క్షణంలో తాను అన్నీ సాధించినట్లు ఫీల్ అయ్యానని చెప్పారు. తానెప్పుడూ RCBకి ఆడాలని తహతహలాడుతుంటానని చెప్పారు. కాగా తమ జట్టు కెప్టెన్గా RCB పాటిదార్ను నియమించిన విషయం తెలిసిందే.