News April 13, 2025
SRPT: ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి: అ.కలెక్టర్

అనంతగిరి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు శనివారం ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని సూచించారు.
Similar News
News November 18, 2025
AP న్యూస్ రౌండప్

* ఒడిశాలో జరిగిన ఏకలవ్య మోడల్ స్కూల్స్ నేషనల్ క్రీడల్లో రాష్ట్రానికి చెందిన గిరిజన విద్యార్థులు 32 బంగారు, 42 వెండి, 40 కాంస్య పతకాలు సాధించారు.
* రాజమండ్రిలో రూ.100 కోట్లతో పైలట్ల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు జార్విస్ ఏవియేషన్ సంస్థ వెల్లడించింది.
* ఇస్రో, TIFR, అణుశక్తి విభాగాల ఆధ్వర్యంలో డిసెంబర్ 31 వరకు రాష్ట్రంలో సైంటిఫిక్ బెలూన్ ప్రయోగాలు జరగనున్నాయి.
News November 18, 2025
AP న్యూస్ రౌండప్

* ఒడిశాలో జరిగిన ఏకలవ్య మోడల్ స్కూల్స్ నేషనల్ క్రీడల్లో రాష్ట్రానికి చెందిన గిరిజన విద్యార్థులు 32 బంగారు, 42 వెండి, 40 కాంస్య పతకాలు సాధించారు.
* రాజమండ్రిలో రూ.100 కోట్లతో పైలట్ల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు జార్విస్ ఏవియేషన్ సంస్థ వెల్లడించింది.
* ఇస్రో, TIFR, అణుశక్తి విభాగాల ఆధ్వర్యంలో డిసెంబర్ 31 వరకు రాష్ట్రంలో సైంటిఫిక్ బెలూన్ ప్రయోగాలు జరగనున్నాయి.
News November 18, 2025
ADB: ఉపకార వేతనం మంజూరుకై దరఖాస్తుల ఆహ్వానం

2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు తెలిపారు. అర్హులైన విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా డిసెంబర్ 15 లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


