News April 13, 2025

SRPT: ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి: అ.కలెక్టర్

image

అనంతగిరి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు శనివారం ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని సూచించారు.

Similar News

News November 19, 2025

SRCL: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి హేయమైన చర్య: మంత్రి పొన్నం

image

రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై జరిగిన <<18333594>>దాడిని<<>> రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. విధుల్లో ఉన్న ఉద్యోగిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. దాడి చేసిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఎస్పీని ఆదేశించారు.

News November 19, 2025

ఈవీల విక్రయాల్లో MG విండ్సర్ రికార్డ్

image

ఈవీ కార్ల అమ్మకాల్లో MG విండ్సర్ రికార్డులు బద్దలు కొడుతోంది. భారత్‌లో 400 రోజుల్లోనే 50వేల యూనిట్లు విక్రయించినట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. నెలకు 3,800పైగా కార్ల చొప్పున విక్రయాలు జరిగినట్లు పేర్కొంది. భారతీయ మార్కెట్లో అత్యంత వేగంగా 50వేల మార్కును అందుకున్న ఫోర్ వీలర్ ఈవీగా నిలిచినట్లు వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన MG.. ఇండియాలో JSWతో జతకట్టి తమ కార్ల విక్రయాలు ప్రారంభించింది.

News November 19, 2025

MNCL: తీన్మార్ మల్లన్నతో ఉమ్మడి జిల్లా అధ్యక్షుల భేటీ

image

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో గురువారం ఇటీవల నూతనంగా నియమితులైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు భేటీ అయ్యారు. తమకు కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి పాటుపడాలని సూచించారు.