News March 8, 2025

SRPT: పంక్చర్లు వేస్తూ.. కుటుంబానికి ఆసరాగా నిలుస్తూ..

image

25 ఏళ్లుగా పంక్చర్ షాపు నడుపుతూ తన ఇద్దరి కుమారుల చదువుకు ఆసరాగా నిలుస్తున్నారు తిరుమలగిరి మండలం వెలిశాలకు చెందిన గృహిణి బత్తిని పుష్ప. భర్త యాకయ్య గౌడ్ వృత్తికి తోడుగా కుటుంబ బాధ్యతలు పంచుకుంటూ పంక్చర్ షాపు చూసుకుంటున్నారు. లారీలు, ట్రాక్టర్లు, భారీ వాహనాలకు పంక్చర్లు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. స్వయం ఉపాధితో స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఈ అమ్మ కథ ఎంతో మంది మహిళలకు ఆదర్శం.

Similar News

News December 9, 2025

ఈ మండలాల్లో ఎన్నికల ప్రచారం చేయవద్దు: సుర్యాపేట ఎస్పీ

image

సూర్యాపేట జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యపేట, ఆత్మకూర్, మద్దిరాల, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి ఈ మండలాలలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల సమయం ముగిసిందని ఎస్పీ నర్సింహ ఓ ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా చేరవద్దని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 9, 2025

సూర్యాపేట: ముగిసిన మొదటి విడత ఎన్నికల ప్రచారం

image

సూర్యాపేట జిల్లాలో గ్రామపంచాయతీ, వార్డు సభ్యుల ఎన్నికల మొదటి విడత ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటి నుంచి బరిలో నిలిచిన వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ఈనెల 11న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారంలో నిలబడిన అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

News December 9, 2025

మెదక్: సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా చుక్క రాములు

image

సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా చుక్క రాములు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెదక్‌లో మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర 5వ మహాసభల్లో ఈ మేరకు తీర్మానం చేశారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పాలడుగు భాస్కర్, కోశాధికారిగా రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అనేక కార్మిక అంశాలపై తీర్మానాలు చేశారు. నూతన కార్యవర్గానికి మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం అభినందనలు తెలిపారు.