News March 30, 2025
SRPT: పక్కింటి వారు తిట్టారని మహిళ సూసైడ్

పక్కింటి వారు తిట్టారని మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన వేల్పుకొండ మంజుల(42) పక్కింటి వారు తిట్టారినే కారణంతో శనివారం మధ్యహ్నం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంజుల కుమారుడు యాకస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
Similar News
News November 27, 2025
ADB: మూడు నెలల్లో నలుగురు గర్భిణుల మృతి

వైద్యుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదికి వస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక గర్భిణుల మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత మూడు నెలల్లో సిరికొండలో ఏత్మబాయి, ఇచ్చోడలో అనురాధ, గుడిహత్నూర్లో రుక్మాబాయి, ఆమె బిడ్డ, రోడ్డు, సిగ్నల్ సరిగా లేక సోమవారం ఉట్నూర్లో జంగుబాయి, ఆమె బిడ్డ మృతి చెందారు. గిరిజనులకు కనీస సౌకర్యాలు అందించకపోవడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
News November 27, 2025
ఉదయగిరి: విద్యార్థిని చితకబాదిన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు

ఉదయగిరి బాలాజీ నగర్లో ఉన్న ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో విద్యార్థిపై నిర్వాహకుడు అంజయ్య వాతలు పడేలా కొట్టిన ఘటన చోటుచేసుకుంది. కలిగిరి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి ఆరో తరగతి నవోదయ ప్రవేశానికి ముందస్తుగా ఈ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ ఇక్కడే వసతి గృహంలో ఉంటున్నారు. ఈ ఘటనతో విద్యార్థి తల్లిదండ్రులు, నిర్వాహకులకు మధ్య గొడవ జరిగింది. అనంతరం వారు విద్యార్థిని ఇంటికి తీసుకువెళ్లారు.
News November 27, 2025
ముంపును తట్టుకొని అధిక దిగుబడి అందించిన వరి రకాలు

ఇటీవల మెుంథా తుఫానుకు వేలాది ఎకరాల్లో వరి దెబ్బతింది. కానీ ఈ తీవ్ర తుఫాన్ను ఎదుర్కొని మంచి దిగుబడినిచ్చాయి R.G.L- 7034, M.T.U-1232 వరి రకాలు. తీవ్ర గాలులు, వరద ముంపు, అనంతర చీడపీడలను తట్టుకొని ఈ 2 వరి రకాలు ఆశించిన దిగుబడినిచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. తక్కువ ఎరువుల మోతాదుతో అధిక దిగుబడినిచ్చే ఈ వరి వంగడాల పూర్తి సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.


