News March 30, 2025
SRPT: పక్కింటి వారు తిట్టారని మహిళ సూసైడ్

పక్కింటి వారు తిట్టారని మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన వేల్పుకొండ మంజుల(42) పక్కింటి వారు తిట్టారినే కారణంతో శనివారం మధ్యహ్నం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంజుల కుమారుడు యాకస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
Similar News
News December 20, 2025
APPLY NOW: APEDAలో ఉద్యోగాలు

<
News December 20, 2025
పార్వతీపురం: నాణ్యమైన పోషకాహారం అందించడమే ప్రధాన లక్ష్యం

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పోషకాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. చిన్నారులకు, గర్భిణులకు అందించే పాలు తాజాగా ఉండేలా చూడాలని, ఏపీ డెయిరీ ద్వారా సరఫరా ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకుండా పర్యవేక్షించాలన్నారు.
News December 20, 2025
కరీంనగర్ ఎస్ఆర్ఆర్ అధ్యాపకుడికి డాక్టరేట్ పట్టా

KNR నగరంలోని SRR ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకుడు శంకరయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఆయన ‘సింథసిస్ బయోలాజికల్ ఎవల్యూషన్ అండ్ మాలిక్యులర్ డాకింగ్ స్టడీస్ ఆఫ్ న్యూ బెంజిమెడజోల్’ అనే అంశంపై పరిశోధన పూర్తిచేశారు. కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, అధ్యాపకులు సురేందర్ రెడ్డి, సత్య ప్రకాష్, సంజీవ్ తదితరులు శంకరయ్యను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.


