News March 19, 2025

SRPT: పది పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

సూర్యాపేట జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు.  67 పరీక్షా కేంద్రాల్లో 11,912 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు చెప్పారు. ఉ. 9:30 నుంచి మ. 12:30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 4 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 67 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

Similar News

News February 27, 2026

TU: M.Ed 3వ సెమిస్టర్ ఫీజు చెల్లింపునకు నేడే ఆఖరు

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని M.Ed మూడో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లింపునకు శుక్రవారం చివరి తేదీ అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కె.సంపత్ కుమార్ తెలిపారు. సాయంత్రం లోపు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా రూ.1210 ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.100 అపరాధ రుసుంతో మార్చి 2 వరకు అవకాశముందని ఆయన పేర్కొన్నారు. పరీక్షలను మార్చి నెలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

News February 27, 2026

HYD: సారూ.. అందెశ్రీకి ఇచ్చే గౌరవం ఇదేనా?

image

ప్రముఖ కవి, TG గేయ రచయిత అందెశ్రీ మరణించి 108 రోజులు గడిచినా సమాధి కోసం ఒక్క ఇటుక కూడా పెట్టకపోవడం సిగ్గుచేటని జనాలు మండిపడుతున్నారు. TG ఉద్యమానికి స్వరం ఇచ్చిన కవికి కనీస గౌరవం లేకపోవడం దురదృష్టకరమని దుమ్మెత్తిపోస్తున్నారు. పాడె మోసి, స్మృతి వనం కడతామని హామీ ఇచ్చిన సీఎం మాటలు నీటి మూటలయ్యాయని కొందరు పెదవి విరుస్తున్నారు. నెలలు గడుస్తున్నా సమాధి పనులు మొదలుకాకపోవడంపై విమర్శలొస్తున్నాయి.

News February 27, 2026

శ్రీకాకుళం: డయేరియాపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీరియస్

image

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తాగునీరు, మురికి కాలువల నిర్వహణ, పరిశుభ్రత విషయంలో అధికారులు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.