News February 22, 2025
SRPT: ‘పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’

మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. శనివారం కలెక్టరేట్లో DEO అశోక్తో కలిసి జిల్లాలోని హై స్కూల్ హెడ్ మాస్టర్లు, మండల విద్యాధికారులు, విద్యాశాఖ అధికారులతో నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు.
Similar News
News December 13, 2025
భద్రాద్రి జిల్లాలో రెండో విడతలో ఏకగ్రీవమైన జీపీలు..

భద్రాద్రి జిల్లాలోని 7 మండలాల్లో రేపు రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
వివరాలిలా.. అన్నపురెడ్డిపల్లి(M) గుంపెన – ధారబోయిన నరసింహ, ఊటుపల్లి – వాడే వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట(M) మద్దికొండ- తాటి రామకృష్ణ, రామన్నగూడెం- మడకం నాగేశ్వరరావు, ములకలపల్లి(M) పొగళ్లపల్లి – మడకం రవి, చండ్రుగొండ(M) బెండలపాడు-బొర్రా లలిత, మంగయ్య బంజర- మాలోత్ గోపికృష్ణ.
News December 13, 2025
15న టెక్కలిలో ప్రజా వేదిక: కలెక్టర్

ఈనెల 15న టెక్కలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం తెలిపారు. టెక్కలి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని నూతన సమావేశ మందిరంలో నిర్వహిస్తారని చెప్పారు. ఈ వేదికలో ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 13, 2025
పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ రోహిత్ రాజు

పంచాయతీ ఎన్నికల సందర్భంగా భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు బుధవారం ఇల్లందు పోలీస్ స్టేషన్లో సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, పంచాయతీల వారీగా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.


