News April 1, 2025

SRPT: పొట్టకూటి కోసం వెళ్తే మృత్యువు వెంటాడింది

image

పొట్టకూటి కోసం కూలికి వెళ్లిన వృద్ధురాలిని కారు రూపంలో మృత్యువు కాటేసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన ఆలువల స్వరాజ్యం(60) కూలి పని కోసం ఆటోలో కుంటపల్లికి వచ్చింది. ఆటో దిగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు.

Similar News

News November 29, 2025

నేడు బ్రేక్‌‌ఫాస్ట్ మీట్.. వివాదానికి తెర పడనుందా?

image

కర్ణాటకలో ‘సీఎం కుర్చీ’ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. CM సిద్దరామయ్య, Dy.CM DK శివకుమార్‌లకు ఇవాళ 9.30AMకు బ్రేక్‌ఫాస్ట్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ భేటీతో ‘సీఎం’ వివాదానికి తెరదించాలని భావిస్తోంది. కాగా 2023 ఎన్నికల సమయంలో అధిష్ఠానం ఇచ్చిన సీఎం హామీని నెరవేర్చాలని DK అనుచర వర్గం కోరుతోంది. అటు అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సిద్దరామయ్య చెప్పారు.

News November 29, 2025

MHBD: చలికాలంలో పల్లెల్లో ఎన్నికల వేడి..!

image

చలికాలం పల్లెల్లో ఎన్నికల వేడి మొదలైంది. MHBD జిల్లాలో ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి రావడంతో పల్లె పోరుకు రె‘ఢీ’ అవుతున్నారు. పల్లెల్లో రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎవరిని నిలపాలి? ఏ కుటుంబానికి గ్రామంలో బలం ఉంది? గతంలో పనిచేసిన, గ్రామానికి ఉపయోగపడిన వ్యక్తుల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్లు, వర్గ ఓట్లపై రాజకీయ పార్టీలు నిశితంగా లెక్కలు వేస్తున్నాయి.

News November 29, 2025

మెదక్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

image

మెదక్ వెస్లీ పాఠశాలలో డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో నిర్వహించే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని డీఈవో విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించే ఎగ్జిబిట్స్ శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే విధంగా ఉండాలని సూచించారు. శాస్త్ర సాంకేతిక, రవాణా, వాతావరణ కాలుష్యం, కంప్యూటర్ రంగం వంటి వివిధ భాగాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు.