News February 1, 2025
SRPT: విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసిన కలెక్టర్

విద్యార్థులు ఉన్నత ఆశయంతో చదివి సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణ పరిధిలోని ఇమంపేట ఆదర్శ పాఠశాలను సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజన నాణ్యతను, మెనూ పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, అధికారులు ఉన్నారు.
Similar News
News November 15, 2025
సిరిసిల్ల: స్వెటర్ల దుకాణాలు వచ్చేశాయి..!

గత వారం, పది రోజులుగా చలితీవ్రత పెరుగుతూ వస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో ప్రజలు చలి నుంచి రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వేములవాడ, సిరిసిల్ల పట్టణాలలో కొత్తగా స్వెటర్ దుకాణాలు వెలిశాయి. నేపాల్కు చెందిన వ్యాపారులు వీటిని ఏర్పాటు చేశారు. నాణ్యమైన ఉన్నితో రూపొందించిన ఈ దుస్తులు ఎక్కువ కాలం మన్నుతాయని వారు అంటున్నారు.
News November 15, 2025
ఏరో ఇంజిన్ రాజధానిగా తెలంగాణ: శ్రీధర్ బాబు

TG: ఏరో ఇంజిన్ రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలదే కీలక పాత్ర అని చెప్పారు. ఇప్పటికే 25కు పైగా ‘A&D’ సంస్థలు, 1500కు పైగా MSMEలు ‘TG బ్రాండ్’ను విస్తరించాయని చెప్పారు. ₹800 CRతో JSW డిఫెన్స్ ‘UAV మాన్యుఫ్యాక్చరింగ్ UNIT’, ₹500 CRతో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ డిఫెన్స్ ఫెసిలిటీ వస్తున్నాయన్నారు.
News November 15, 2025
ADB: ఫెన్సింగ్ క్రీడాకారులకు శిక్షణ శిబిరం: సత్యనారాయణ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్జిఎఫ్ ఫెన్సింగ్ జోనల్ స్థాయి పోటీలలో సెలెక్ట్ అయిన అండర్ 14,17క్రీడాకారులకు 18వ తేదిన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో ఒక్కరోజు క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని అధ్యక్షుడు చిట్లా సత్యనారాయణ తెలిపారు. కావున అందరు కూడా ఎలిజిబుల్ ఫార్మ్స్తో హాజరు కాగలరని తెలిపారు. ఫోన్ 9550838190కు సంప్రదించాలన్నారు.


