News February 1, 2025

SRPT: విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసిన కలెక్టర్

image

విద్యార్థులు ఉన్నత ఆశయంతో చదివి సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణ పరిధిలోని ఇమంపేట ఆదర్శ పాఠశాలను సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజన నాణ్యతను, మెనూ పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, అధికారులు ఉన్నారు.

Similar News

News December 10, 2025

ఆ లెక్కలు చంద్రబాబు సృష్టే: జగన్

image

AP: 2025-26 ఏడాదికి ప్రభుత్వం ఇచ్చిన GSDP అంచనాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. ‘ప్రజలను మోసం చేసేందుకే ఈ గణాంకాలను CBN మార్గదర్శకత్వంలో తయారు చేశారు. కాగ్ నివేదికలు నిజమైన ఆదాయాలు, ఖర్చులను ప్రతిబింబిస్తున్నాయి. వాటి ప్రకారం ఆదాయాల పెరుగుదల తగ్గి, అప్పులు పెరిగాయి. అభివృద్ధి కోసం పెట్టే ఖర్చు, పెట్టుబడులు తగ్గాయి. రెవెన్యూ లోటు ఆందోళనకరంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.

News December 10, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ నేటితో జిల్లాలో ముగిసిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం
✓ ఎన్నికల సిబ్బంది రేపు రిపోర్ట్ చేయాలి: కలెక్టర్
✓ భద్రాచలంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
✓ ముక్కోటి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం: కలెక్టర్
✓ గుండాల: యువతిని మోసం చేసిన నిందితుడికి 10 ఏళ్ల జైలు
✓ ఎన్నికలకు 1700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు: ఎస్పీ
✓ అన్నపురెడ్డిపల్లి: ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలి: డీఎస్పీ

News December 10, 2025

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి: కలెక్టర్

image

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. పౌర సరఫరా సంస్థ అధికారులతో మంగళవారం ఆయన సమావేశమై మాట్లాడారు. ధాన్యం అధికంగా కొనుగోలు చేసిన రైతు సేవా కేంద్రం సహాయకునికి, పౌరసరఫరాల ఉపతహశీల్దార్, తహశీల్దార్లకు అవార్డులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డులను జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఇస్తామన్నారు.