News February 1, 2025

SRPT: విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసిన కలెక్టర్

image

విద్యార్థులు ఉన్నత ఆశయంతో చదివి సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణ పరిధిలోని ఇమంపేట ఆదర్శ పాఠశాలను సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజన నాణ్యతను, మెనూ పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, అధికారులు ఉన్నారు.

Similar News

News November 14, 2025

జీవకోన వాసికి 14 రోజుల రిమాండ్

image

భారీ స్థాయిలో గంజాయి సరఫరా చేస్తున్న స్మగ్లర్‌ను అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రామకిశోర్ వివరాల మేరకు.. గురువారం గంజాయి తరలిస్తున్న జీవకోన వాసి జగదీష్ (37)ను ఉదయం 10 గంటలకు గోవింద హోమ్ స్టే సమీపంలో పట్టుకున్నారు. 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు.

News November 14, 2025

కౌంటింగ్‌లో కుట్రకు ప్లాన్: తేజస్వీ

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నెమ్మదింపజేసేందుకు రేపు కుట్ర జరుగుతుందని RJD నేత తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. మహాగఠ్‌బంధన్‌ అభ్యర్థులు గెలిస్తే ప్రకటించవద్దని, తొలుత ఎన్డీయే అభ్యర్థుల గెలుపునే ప్రకటించాలని అధికారులకు చెప్పారని పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులకు ఫోన్లు చేశారని తమకు సమాచారం వచ్చిందని చెప్పారు. క్లియర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

News November 14, 2025

మడ్చల్: ఎర్రజెండాతోనే సమస్యల పరిష్కారం: MLA

image

భారత దేశంలో ప్రత్యామ్నాయం కమ్యూనిజమేనని, ప్రజా సమస్యల పరిష్కారం ఎర్రజెండాలతోనే సాధ్యమని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సమితి సమావేశం ఈసీఐఎల్‌లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాస్ అధ్యక్షతన జరగగా, కూనంనేని ముఖ్య అతిధిగా హాజరయ్యారు.