News April 1, 2025

SRPT: సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: ఎస్పీ

image

సైబర్ నేరాలపై యువత అప్రమత్తత, అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రావడం, ఉచితంగా బహుమతులు పొందడం, మన ప్రమేయం లేకుండా ఏదైనా వస్తుంది అంటే దాని వెనుక సైబర్ మోసగాళ్లు ఉన్నారని గ్రహించాలని తెలిపారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయారా? మీ డబ్బును పోగొట్టుకున్నారా? అయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.

Similar News

News February 24, 2026

అవన్నీ ఫేక్.. తన రెండో పెళ్లిపై వస్తున్న రూమర్లకు ధవన్ చెక్!

image

రెండో పెళ్లి తర్వాత తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని శిఖర్ ధవన్ ఖండించారు. ‘నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరని నా మాజీ భార్య శాపనార్థాలు పెట్టిందని, దానికి బదులుగానే మళ్లీ మ్యారేజ్ చేసుకున్నానని’ SMలో వస్తున్న రూమర్స్‌లో నిజం లేదని ధవన్ స్పష్టం చేశారు. ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయొద్దని, తానెప్పుడూ పాజిటివిటీని కోరుకుంటానన్నారు. సోఫీ షైన్‌తో తన కొత్త లైఫ్‌ను సంతోషంగా మొదలుపెట్టినట్లు వెల్లడించారు.

News February 24, 2026

ఇంట్లో గవ్వలు ఎందుకు ఉండాలి?

image

గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. సముద్రం నుంచి ఉద్భవించిన వీటిని లక్ష్మీదేవికి తోబుట్టువుగా చెబుతారు. ఇవి ఇంట్లో ఉంటే మహాలక్ష్మి కటాక్షం కలిగి, ఆర్థిక ఇబ్బందులు పోతాయని పండితులు చెబుతున్నారు. ‘పసుపు రంగు గవ్వలు పూజా గదిలో, గల్లా పెట్టెలో ఉంచితే ధనాకర్షణ పెరుగుతుంది. గవ్వలకు ప్రతికూల శక్తిని హరించే గుణం ఉంది. అందుకే ఇంటి గుమ్మానికి గవ్వల తోరణం కట్టాలి. దిష్టి దోషాలు పోతాయి’ అంటున్నారు.

News February 24, 2026

‘ఓం శాంతి శాంతి శాంతిః’ OTT డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

image

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ మూవీ మార్చి 4 నుంచి ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ఆహాలో అందుబాటులోకి రానుంది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ ఒకరోజు ముందే అంటే మార్చి 3 నుంచే ఈ చిత్రాన్ని చూడవచ్చు. భర్త పెట్టే హింసను భరిస్తూ చివరకు అతడికి తగిన గుణపాఠం చెప్పే భార్య కథే ఈ సినిమా స్టోరీ.