News April 3, 2025
SRPT: ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్మెన్ పోస్టులు ఉన్నాయన్నారు. ఐటీఐ, డిప్లొమా, ఎన్సీసీ కలిగిన వారికి బోనస్ మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. www. joinindianarmy.nic.వెబ్సైట్లో ఈ నెల 10 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 04027740205 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.
Similar News
News September 18, 2025
మంచిర్యాల: 19న పలు రైళ్ల రద్దు

మందమర్రి-రామగుండం మధ్య 24 కి.మీ ట్రిపుల్ లైన్ రైల్వే మార్గంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనులు చేపట్టడంతో ఈనెల 19న పలు రైళ్లు రద్దు చేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రామగిరి ఎక్స్ప్రెస్, కాజీపేట-బల్లార్షా ఎక్స్ప్రెస్ పూర్తిగా రద్దు కాగా, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్-కాజీపేట వరకు, సింగరేణి ఎక్స్ప్రెస్ భద్రాచలం రోడ్డు నుంచి వరంగల్ వరకు నడుస్తాయని తెలిపారు.
News September 18, 2025
పత్తి కొనుగోళ్లు.. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: కలెక్టర్

2025-26 పత్తి కొనుగోలు సీజన్పై సంగారెడ్డి కలెక్టరేట్లో అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో కలెక్టర్ ప్రావీణ్య సమీక్షించారు. సీసీఐ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు జరపాలన్నారు. జిన్నింగ్ మిల్లుల తనిఖీలు, భద్రతా ఏర్పాట్లు పరిశీలించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. పత్తి కొనుగోలు ప్రక్రియ సజావుగా, రైతులకు లాభదాయకంగా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.
News September 18, 2025
HYD: పార్కులు కాపాడిన హైడ్రా.. హెచ్చరిక బోర్డులు

హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని పార్కు స్థలాలను ఆక్రమణల నుంచి రక్షించారు. కూకట్పల్లి మూసాపేట సర్కిల్లోని సనత్నగర్ కోఆపరేటివ్ సొసైటీ లే ఔట్లో 1600 గజాల భూమిని, రంగారెడ్డి జిల్లా మదీనాగూడలో పార్కు కోసం కేటాయించిన 600ల గజాల స్థలాన్ని కాపాడారు. ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.