News February 13, 2025
SRPT: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. బరిలో ఎక్కువమంది పోటీ పడుతుండడంతో ఎన్నిక రసవత్తరం కానుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
Similar News
News January 9, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 9, 2026
అక్రమ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: కర్నూలు కమిషనర్

కర్నూలులో అనుమతి లేకుండా బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, డిజిటల్ హోర్డింగులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ విశ్వనాథ్ హెచ్చరించారు. ప్రకటన ఏజెన్సీలు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.30 వేల వరకు జరిమానా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏజెన్సీలు తమ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన ఆదేశించారు.
News January 9, 2026
శ్రీశైలంలో దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన ప్రదేశం ఇదే..!

శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామికి గురువారం విశేష పూజలు చేశారు. ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద దత్తాత్రేయ స్వామి తపస్సు చేశారని, అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షం అని పేరు వచ్చినట్లు తెలిపారు. ప్రతి గురువారం దేవస్థానం సర్కారీ సేవగా పూజలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.


