News January 31, 2025

SRPT: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికుల వివరాలిలా.. తిరుమలగిరి మండలం వెలిశాలకి చెందిన పొన్నం గణేశ్ డీసీఎం డ్రైవర్. గుంటూరు జిల్లా నరసరావుపేట వద్ద కోళ్ల లోడుతో వస్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గణేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గణేశ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Similar News

News December 2, 2025

HYDలో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్

image

హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం జరగనుంది. యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం హైదరాబాదులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 23 యూరోపియన్ దేశాలకు చెందిన 23 ఉత్తమ చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానున్నాయి. ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్, శ్రీసారథి స్టూడియోస్, అలయన్స్ ఫ్రాన్సిస్ హైదరాబాద్‌లో ఈ సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి 14 వరకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

News December 2, 2025

WGL: నేనూ.. గ్రామానికి ప్రథమ పౌరుడిని..!

image

ఉమ్మడి జిల్లాలో GP ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. సర్పంచ్ పదవికి భారీ పోటీ ఉన్నా, గౌరవ వేతనం మాత్రం నెలకు రూ.6,500. 2015లో వేతనం రూ.5,000గా నిర్ణయించగా 2021లో రూ.6,500గా పెంచారు. అభివృద్ధి బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఆదాయం లేక అప్పులు మాత్రం భారం అవుతున్నాయి. అయినా ‘గ్రామానికి ప్రథమ పౌరుడు’ అన్న గౌరవం, ప్రతిష్ఠ కోసం రూ.లక్షలు ఖర్చు చేసి పోటీ పడుతున్నారు. మీ గ్రామాల్లో ఎలా ఉందో కామెంట్ చేయండి.

News December 2, 2025

లేటెస్ట్ అప్డేట్స్

image

* సచివాలయంలో విద్యుత్, మైనింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించనున్న సీఎం చంద్రబాబు
* కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రారంభించనున్న సీఎం రేవంత్
* హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారులు సోదాలు.. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమానిని విచారించిన అధికారులు.. షాగౌస్, పిస్తా హౌస్, మెహిఫిల్ హోటళ్లతో సంబంధాలపై ఆరా
* కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్