News January 31, 2025
SRPT: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికుల వివరాలిలా.. తిరుమలగిరి మండలం వెలిశాలకి చెందిన పొన్నం గణేశ్ డీసీఎం డ్రైవర్. గుంటూరు జిల్లా నరసరావుపేట వద్ద కోళ్ల లోడుతో వస్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గణేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గణేశ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 19, 2025
నల్గొండ: జిల్లాలో తగ్గిన వాహన రిజిస్ట్రేషన్లు

జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. జులై, ఆగస్టు నెలల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య వెయ్యికి పైగా చేరాయి. కానీ సెప్టెంబర్లో మాత్రం వందల సంఖ్యలో మాత్రమే వాహనాల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. కార్లు, బైక్లపై కేంద్రం విధించే జీఎస్టీని తగ్గిస్తున్నామని, ఈ నిర్ణయం ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందని ఆగస్టు నెలాఖరులో కేంద్రం ప్రకటించింది. దీంతో వాహనప్రియులు తమ వాహనాల బుకింగ్లను వాయిదా వేసుకున్నారు.
News September 19, 2025
SKLM: 10 నుంచి 12 గంటల వరకే ఈ అవకాశం

ఇవాళ దివ్యాంగుల స్వాభిమాన్ గ్రీవెన్స్ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించనున్నట్లు జడ్పి సీఈఓ శ్రీధర్ రాజా తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12:00 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News September 19, 2025
29 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

విధుల్లో నిర్లక్ష్యం వహించిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలపై మున్సిపల్ కమిషనర్ బాలాస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 20 మంది వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు, 9 మందికి మెమోలు జారీ చేసినట్లు వివరించారు. నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.