News March 4, 2025

SRPT: టీచర్ MLC ఎన్నికలు.. ‘ఏక్’ నిరంజన్!

image

NLG – KMM – WGL టీచర్ MLC ఎన్నికల ఫలితాల్లో ఓ అభ్యర్థి ఒకటే ఓటు వచ్చింది. ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో బంకా రాజు-7, కంటె సాయన్న-5, చలిక చంద్రశేకర్-1 సింగిల్ డిజిట్ ఓట్లకే పరిమితమయ్యారు. కాగా.. మరో ఆరుగురు తాటికొండ వెంకటయ్య-39, జంగిటి కైలాసం-26, పన్నాల గోపాల్‌రెడ్డి-24, అర్వ స్వాతి-20, లింగిడివెంకటేశ్వర్లు-15, పురుషోత్తంరెడ్డి-11 డబుల్ డిజిట్ ఓట్లతో సరిపెట్టుకున్నారు.

Similar News

News December 14, 2025

మంచిర్యాల: జిల్లాలో ముగిసిన రెండవ దశ పోలింగ్

image

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో 2వ దశ ఎన్నికల పోలింగ్ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
దీంతో పోటీ చేసిన అభ్యర్థులు టెన్షన్ నెలకొంది. ముందుగా వార్డు సభ్యుల ఓట్లను ఎక్కించి అనంతరం సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కించనున్నారు.

News December 14, 2025

ఓబెరాయ్ హోటల్‌కు 20 ఎకరాల స్థలం

image

తిరుపతిలో ఓబెరాయ్ హోటల్‌కు ప్రభుత్వం 20ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. SRO రేటులో 1% చొప్పున లీజు అద్దె నిర్ణయించింది. రూ.26.08 కోట్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను మినహాయించింది. విద్యుత్ కనెక్షన్ ఖర్చులు, కన్సల్టేషన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఫీజుల సర్దుబాటుకు నిరాకరించింది. TTDతో ఎక్స్ఛేంజ్ డీడ్ కోసం రూ.32.60 కోట్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయించింది.

News December 14, 2025

భవానీ దీక్షల విరమణ.. 3.75 లక్షల మంది అమ్మవారి దర్శనం

image

భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఈ నెల 11 నుంచి సుమారు 3.75 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. ఆదివారం ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. భక్తులకు దర్శనం, అన్నప్రసాదం, తాగునీరు, ఉచిత రవాణా వంటి ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని కమిషనర్ పేర్కొన్నారు. ఆయన వెంట ఈవో శీనా నాయక్ ఉన్నారు.