News October 28, 2025
SRPT: ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

వర్షాలు కురుస్తున్న నేపద్యంలో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని నిర్వాహకులకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే జాజిరెడ్డిగూడెం మండలంలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రైతులకు సరిపడా టార్పాలిన్లను అందించాలని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
Similar News
News October 28, 2025
కర్నూలు: బస్సు ప్రమాదం కేసులో డ్రైవర్ అరెస్ట్.!

కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో 24వ తేదీన జరిగిన బస్సు ప్రమాదం కేసులో వి.కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా పత్తికొండ DSP వెంకట్రామయ్య పర్యవేక్షణలో విచారణ జరిపి, నిందితుడిని మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు జిల్లా SP విక్రాంత్ పాటిల్ తెలిపారు.
News October 28, 2025
ఆదిలాబాద్: బాలుడి కిడ్నాప్కు యత్నం.. కేసు నమోదు

బాలుడి కిడ్నాప్ యత్నం కేసును నమోదు చేశామని వన్ టౌన్ సీఐ సునీల్ తెలిపారు. యూపీలోని ఫైజాబాద్కు చెందిన రాహుల్ అనే యువకుడు ఆదిలాబాద్ ఖానాపూర్ కాలనీలో ఒక బాలుడిని అపహరించే యత్నం చేస్తుండగా కాలనీకి చెందిన షేక్ హసన్తోపాటు కొందరు పట్టుకున్నారని పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారన్నారు. నిందితుడు తన పేరును సలీం, సల్మాన్ పేర్కొనగా ఆధార్ కార్డు పరిశీలించగా రాహుల్గా గుర్తించామన్నారు.
News October 28, 2025
ముత్తారం: ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ తనిఖీలు

ముత్తారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ డీ.కల్పన మంగళవారం తనిఖీలు నిర్వహించారు. పాఠశాల పరిసరాలను, రిజిస్టర్లను పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల హాజరు శాతం, యూనిట్ టెస్ట్ మార్కుల వివరాలపై ఆరా తీశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, మార్కులు ఎక్కువ వచ్చేలా కృషి చేయాలన్నారు. అధ్యాపకుల టీచింగ్ విషయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.


