News September 22, 2025
SRPT: బడికి సెలవు.. నాకు కాదు

దసరా సెలవులంటే సరదాగా ఆటపాటలతో గడపాల్సిన వయసులో ఓ బాలిక తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. చివ్వెంల మండలం బండమీది చందుపట్లలో జాతీయ రహదారి 365(BB)పై ఈ దృశ్యం కనిపించింది. చందుపట్లలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ధరావత్ గ్రీష్మ తన తండ్రి వరి పొలానికి మందు కొడుతుండగా, తాను గొర్రెలను మేపుతూ బడిలో ఇచ్చిన హోంవర్క్ను రాసుకుంటూ కనిపించింది.
Similar News
News September 23, 2025
MBNR జిల్లాలో 315 దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు: ఎస్పీ

మహబూబ్నగర్ జిల్లాలో 315 దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రతి మండపం వద్ద నిర్వాహకులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ పాయింట్ బుక్స్ ఏర్పాటు చేస్తామని, తనిఖీలకు సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
News September 23, 2025
GWL: ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి: ఎస్పీ

ప్రజల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పోలీసులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో 16 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వీటిలో భూ సమస్యలు 3, కుటుంబ తగాదాలు 4, గొడవలు 3, ప్లాటు, ప్రభుత్వ ఉద్యోగం, విదేశాలకు పంపే అంశాలపై ఒక్కో ఫిర్యాదు వచ్చాయన్నారు. ఇతర అంశాలపై 3 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు.
News September 23, 2025
NGKL: పోలీస్ ప్రజావాణిలో 15 ఫిర్యాదులు

నాగర్కర్నూల్లోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 15 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.