News January 29, 2025

SRPT: మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా!

image

SRPT జిల్లాలోని మున్సిపాలిటీలకు ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేదని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలానికి తెరపడిన విషయం తెలిసిందే. పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఆ మరుసటి రోజు నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. మరో ఆరు నెలలు లేదా ఏడాది పాటు ప్రత్యేక పాలన కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 18, 2025

నేడు బాపట్ల జిల్లాకు భారీ వర్ష సూచన

image

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ బుధవారం ఒక ఒక ప్రకటనలో చెప్పారు. అల్ప పీడన ప్రభావంతో గురువారం బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఒకటి రెండు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.

News September 18, 2025

ఏలూరు: రోడ్డు పక్కన గాయాలతో బాలుడు.. ఆచూకీ లభ్యం

image

ఏలూరులోని వట్లూరు వద్ద బుధవారం రాత్రి రోడ్డు పక్క పొలాల్లో గాయాలతో పడి ఉన్న బాలుడి ఆచూకీ లభించింది. విజయవాడ రామవరప్పాడు గణేశ్ నగర్‌కు చెందిన విజయ్ కుమార్ (14) గా గుర్తించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన అతను తిరిగి వెళ్లలేదు. దీంతో అతని తల్లి పటమట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాలుడిని గుర్తించారు. కాగా బాలుడు ఏలూరు ఎలా? ఎవరితో వచ్చాడు అనేది తెలియాల్సి ఉంది.

News September 18, 2025

4,500 మందితో భద్రతా ఏర్పాట్లు: సీపీ

image

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు 4,500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ రాజశేఖర్ తెలిపారు. సుమారు 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భద్రత పర్యవేక్షణకు 1,000 సీసీ కెమెరాలు, 5 డ్రోన్‌లను వినియోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు.