News February 7, 2026
SRPT: మేడారంలో మైనర్ల లవ్ మ్యారేజ్.. సూసైడ్ అటెంప్ట్

ఖమ్మంలో చదువుకుంటున్న మైనర్ జంట ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఖమ్మం రఘునాథపాలెం మండలానికి చెందిన బాలిక, SRPT(D) ఆత్మకూరుకు చెందిన బాలుడు ఖమ్మంలో ఇంటర్ చదువుతూ ప్రేమలో పడ్డారు. పెద్దలు నిరాకరించడంతో మేడారంలో వివాహం చేసుకున్నారు. మేజర్లు అయ్యేవరకు ఆగాలని కుటుంబీకులు మందలించడంతో మనస్తాపం చెంది ఉరివేసుకున్నారు. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా, బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Similar News
News February 7, 2026
ఎచ్చెర్ల: ఈ కోర్సులకు ఎందుకు డిమాండ్..?

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సులకు గత కొన్నేళ్లుగా శత శాతం ప్రవేశాలు జరుగుతున్నాయి. సైన్స్ విభాగంలోని కోర్సులకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎనలైటికల్ కెమిస్ట్రీ. బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ. కెమికల్, ఫార్మా పరిశ్రమల్లో పుష్కలమైన ఉపాధి అవకాశాలు ఉండటం, పరిశోధనా సంస్థల్లో ఉద్యోగాలకు ఈ కోర్సులు మార్గం చూపడమేనని విద్యార్థులు చెబుతున్నారు.
News February 7, 2026
TENTH: ఇంగ్లిష్ ఎగ్జామ్ తేదీ మార్పు

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లిష్ పరీక్షను మార్చి 20న కాకుండా 21న (శనివారం) నిర్వహించనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 20న రంజాన్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. మిగతా అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.
News February 7, 2026
ముంబై: బీజేపీకి మేయర్, శివసేనకు డిప్యూటీ మేయర్

ముంబై మేయర్గా బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే పేరును ఆ పార్టీ ప్రకటించింది. డిప్యూటీ మేయర్గా శివసేన కార్పొరేటర్ సంజయ్ శంకర్ ఘాడీని ఎంపిక చేశారు. కాగా 227 స్థానాలు ఉన్న ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో మహాయుతి కూటమి 118 చోట్ల (బీజేపీ- 89, శివసేన- 29) విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ముంబై పీఠంపై శివసేన (UBT) పట్టు కోల్పోయింది.


