News March 30, 2025

SRPT: 1500 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు: SP

image

సీఎం హుజూర్నగర్ పర్యటన సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీసులు అన్ని రక్షణ ఏర్పాట్లు చేశారని జిల్లా ఎస్పీ కే.నరసింహ తెలిపారు. హుజూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను, మార్గాలను, సభా ప్రాంగణాన్ని, పార్కింగ్ ప్రదేశాలను, హెలిప్యాడ్ ప్రదేశాన్ని ఎస్పీ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1500 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

కడప: హౌసింగ్ స్కాంలో కాంట్రాక్టర్లను కాపాడుతోంది ఎవరు..?

image

జిల్లాలో వెలుగులోకొచ్చిన రూ.కోట్ల విలువైన హౌసింగ్ స్కాంలో కాంట్రాక్టర్లను కాపాడుతోంది ఎవరని ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు పేజ్-3 కింద ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ స్కాంలో ఇప్పటి వరకు ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుని జీతాలు నిలిపేశారు. సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులకు ఆదేశించారు. ఐతే రూ.కోట్లు కొల్లగొట్టిన కాంట్రాక్టర్లపై మాత్రం చర్యలు లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News November 28, 2025

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలో ఆధునీకరణ పనుల దృష్ట్యా జనవరిలో విశాఖ నుంచి బయలు దేరే పలు రైళ్లు రద్దు చేశారు.
➤ జనవరి 29,31న (12718) – రత్నాచల్ ఎక్స్ ప్రెస్
➤28నుంచి 30వరకు (17239) సింహాద్రి ఎక్స్ ప్రెస్
➤29 నుంచి 31వరకు (17240) సింహాద్రి ఎక్స్ ప్రెస్
➤ 29,30న (12806) జన్మభూమి ఎక్స్ ప్రెస్
➤ 28,29న (12805)జన్మభూమి ఎక్స్ ప్రెస్
➤ 29,31న (67285, 67286) రాజమండ్రి -విశాఖ MEMU పాసెంజర్ రద్దు చేశారు.

News November 28, 2025

సత్యసాయి జిల్లా యువతికి అరుదైన ఛాన్స్

image

​సత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంభాలట్టికి చెందిన దీపికకు అరుదైన గౌరవం దక్కింది. టీమ్ ఇండియా అంధుల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఇటీవల టీ20 ప్రపంచకప్‌ను గెలిపించిన దీపిక, గురువారం జట్టు సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దీపిక ప్రధానితో ఫొటో దిగారు. ప్రధాని మోదీ ఆమెను అభినందించారు.