News January 26, 2025
SRPT: 50 ఏళ్లకు.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం

సూర్యాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 1975-76లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు దాదాపు 50 ఏళ్ల తర్వాత ఆదివారం పాఠశాలలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా 65 ఏళ్ల వయసులో ఉన్న ఆ స్నేహితులు గత స్మృతులను గుర్తు చేసుకొని సందడి చేశారు. తమ మనవళ్లు చేసుకునే సమ్మేళనం తాము చేసుకుంటున్నాం అంటూ ఆనందంగా గడిపారు. 50 ఏళ్లయినా స్నేహానికి వయసు లేదని చెబుతున్నారు.
Similar News
News November 26, 2025
అంబేడ్కర్ చూపిన మార్గంలో నడుద్దాం: SP

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చూపిన మార్గంలో నడుద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం సిరిసిల్లలోని పోలీసు కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటామని ఈ సందర్భంగా పోలీసు అధికారులు ప్రతిజ్ఞ చేశారు.
News November 26, 2025
ఏలూరు: ఒడిశా టూ హైదరాబాద్ అక్రమ రవాణా

పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జీలుగుమిల్లి పోలీసులు బుధవారం నిర్వహించిన విస్తృత వాహన తనిఖీల్లో గోవుల అక్రమ రవాణా వెలుగుచూసింది. ఒడిశా నుంచి హైదరాబాద్కు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా లారీలో తరలిస్తున్న గోవులను గుర్తించి పట్టుకున్నారు. గోవులను సురక్షిత ప్రాంతానికి తరలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
News November 26, 2025
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి: సీఎం చంద్రబాబు

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.


