News January 26, 2025
SRPT: 50 ఏళ్లకు.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం

సూర్యాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 1975-76లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు దాదాపు 50 ఏళ్ల తర్వాత ఆదివారం పాఠశాలలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా 65 ఏళ్ల వయసులో ఉన్న ఆ స్నేహితులు గత స్మృతులను గుర్తు చేసుకొని సందడి చేశారు. తమ మనవళ్లు చేసుకునే సమ్మేళనం తాము చేసుకుంటున్నాం అంటూ ఆనందంగా గడిపారు. 50 ఏళ్లయినా స్నేహానికి వయసు లేదని చెబుతున్నారు.
Similar News
News December 2, 2025
ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్ సూచించారు.
News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<


