News October 12, 2025
SRPT: 93 మద్యం దుకాణాలకు 81 దరఖాస్తులే

తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల నిర్వహణ కోసం ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 18 వరకు మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరించనున్నారు. అయితే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 93 మధ్య దుకాణాలు ఉండగా శనివారం నాటికి 81 దరఖాస్తులు మాత్రమే దాఖలయ్యాయి. SRPT 39, కోదాడ 18, తుంగతుర్తి 19, హుజూర్ నగర్ అత్యంత స్వల్పంగా 5 దరఖాస్తులు మాత్రమే రావడం గమనార్హం.
Similar News
News October 12, 2025
విశాఖకు రైడెన్.. ₹22 వేల కోట్ల రాయితీలు!

AP: గూగుల్ అనుబంధ సంస్థ Raiden Infotech వైజాగ్లో రూ.87,520 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైడెన్కు భారీ సబ్సిడీలు ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. భూమి విలువపై 25% డిస్కౌంట్తో 480 ఎకరాలు, జీఎస్టీపై సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు, నీరు, విద్యుత్ వాడకంపై రాయితీతో సహా మొత్తంగా ₹22 వేల కోట్లకు పైగా ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.
News October 12, 2025
గజ్వేల్: 7 నెలల గర్భంతోనే పెళ్లి చేసుకుంది..!

గజ్వేల్ పరిధి ములుగు మండలంలో <<17983898>>ఇద్దరిపై పోక్సో కేసు నమోదైన<<>> విషయం తెలిసిందే. SI విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. సదరు యువతిని ఏడాదిగా ఉదయ్ కిరణ్ అనే యువకుడు లవ్ చేస్తున్నాడు. అతడు ఆమెను లొంగదీసుకున్నాడు. ఇదే అదనుగా భావించిన మరో యువకుడు పవన్ కళ్యాణ్ ఆమెను బెదిరించి లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో గర్భం దాల్చింది. 7 నెలల గర్భంతో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న 13 రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
News October 12, 2025
శ్రీ రాంసాగర్ నీటిమట్టం 80.053 TMCలు

శ్రీ రాంసాగర్ ప్రాజెక్టులోకి వరద తగ్గడంతో ప్రస్తుతం 6,790 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 80.5 TMCలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 80.053 టీఎంసీలు(1090.90 అడుగులు)గా నమోదైంది. కాకతీయ కాలువ ద్వారా 5000, లక్ష్మి కాలువ ద్వారా 200, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. FFC అలీ సాగర్, గుప్తా ఎత్తిపోతలలకు నీటి విడుదలను నిలిపివేశారు.