News February 1, 2025

SRPT: ఈసారైనా బడ్జెట్లో మోక్షం కలిగేనా…!

image

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దశాబ్దాల కాలం నుంచి నూతన రైల్వే లైన్ల కోసం నల్గొండ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. శంషాబాద్ -SRPT – VJD హై స్పీడ్ రైల్వే లైన్, డోర్నకల్-SRPT-NLG-గద్వాల్ రైల్వే లైన్ కోసం గత ఏడాది సర్వే చేశారు. డోర్నకల్-MLG రైల్వే లైన్, హైదరాబాద్-యాదాద్రి ఎంఎంటీఎస్ రైలుపై బడ్జెట్లో ప్రకటన ఉంటుందో లేదో మరి చూడాలి.?

Similar News

News March 15, 2025

గాజువాకలో బాలికపై అత్యాచారయత్నం..!

image

గాజువాకలో మైనర్‌పై అత్యాచారయత్నం కలకలం రేపింది. డ్రైవర్స్ కాలనీలో పదేళ్ల బాలికపై దాడి భాను ప్రకాష్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగడ్డాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన ఘటన గురించి చిన్నారి వారికి చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో భాను ప్రకాష్‌ని గాజువాక పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

News March 15, 2025

ధన్వాడ: చిరుత దాడిలో దూడ మృతి.!

image

చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన NRPT జిల్లా ధన్వాడ మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి చెందిన రైతు చెట్టుకింది కథలప్ప పొలంలో శుక్రవారం రాత్రి లేగదూడపై చిరుత దాడి చేయడంతో మృతి చెందింది. సుమారు రూ.60 వేలు నష్టం వాటిలినట్లు రైతు తెలిపారు. శనివారం ఉదయం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లేశ్ ఘటన ప్రదేశాన్ని పరిశీలించి చిరుత దాడి జరిగినట్లు నిర్ధారించారు.

News March 15, 2025

కాంగ్రెస్ పాలన దేశ చరిత్రలోనే మాయని మచ్చ: కేటీఆర్

image

కాంగ్రెస్ పాలనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్లో విరుచుకుపడ్డారు. ‘సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికారు. 15 నెలల పాలనలో ఊదు కాలింది లేదు. పీరు లేచింది లేదు. రూ.1.50 లక్షల కోట్లు అప్పు తెచ్చినట్లు ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకుంది. రుణమాఫీ, రైతుభరోసా, సాగునీళ్లు, పంటల కొనుగోళ్లు ఏవీ లేవు. కాంగ్రెస్ పాలన దేశ రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చ’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!