News July 28, 2024

SRSP అప్డేట్: 24గంటల్లో 23,599 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గడిచిన 24 గంటల్లో సుమారు 23,599 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని అధికారులు ఆదివారం ఉదయం తెలిపారు. ప్రాజెక్ట్ నుంచి 624 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,074.6 అడుగుల మేర ఉందని చెప్పారు.

Similar News

News November 1, 2025

వర్ని: బాలికపై లైంగిక దాడి.. యువకుడిపై పోక్సో కేసు

image

వర్నిమండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై గణేష్ (24)అనే యువకుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడగా బాలిక గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం ఆమెకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వర్ని SI మహేష్ తెలిపారు.

News October 31, 2025

నిజామాబాద్‌లో పోలీస్‌ల కొవ్వొత్తుల ర్యాలీ

image

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో పట్టణంలోని కోర్ట్ చౌరస్తా నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేవని కొనియాడారు. వారి వల్లే సమాజంలో శాంతి నెలకొందన్నారు. పోలీస్ శాఖ ఎప్పుడు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు.

News October 31, 2025

బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా నుంచి రక్షించాలి: కవిత

image

చారిత్రాత్మక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కోరారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆమె శుక్రవారం బొమ్మలమ్మగుట్టను సందర్శించారు. ఈ గుట్టపై గ్రానైట్ మాఫియా కన్నుపడిందన్నారు. సొంత ఖజానా నింపుకోవడానికి గుట్టను విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. భవిష్యత్ తరాల కోసం గుట్టను రక్షించుకోవాలన్నారు.