News July 27, 2024

SRSP అప్డేట్: 30 వేల క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో తగ్గుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 35,078 క్యూసెక్కుల నీరు రాగా సాయంత్రం 6 గంటలకు అది 30,554 క్యూసెక్కులకు తగినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు ఉండగా ప్రస్తుతం 1074.20 అడుగుల నీరు నిల్వ ఉందని వివరించారు.

Similar News

News October 8, 2024

బోధన్: స్నేహితుడిపై కోపంతో సొంత వాహనానికి నిప్పు

image

బోధన్ పోలీస్ స్టేషన్ ఎదుట సాయిలు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని తానే తగలబెట్టుకున్నాడు. తన స్నేహితుడు శంకర్ పదేళ్ల క్రితం రూ.70 వేలు తీసుకుని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తిరిగి ఇవ్వమని కోరితే ఎలాంటి స్పందన లేకపోవటంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం తమ పరిధిలోకి రాని అంశమని పోలీసులు సూచించగా తనకు న్యాయం జరిగే వరకూ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లేది లేదని తన బైకును సాయిలు తగలబెట్టుకున్నాడు.

News October 8, 2024

వర్గపోరును ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు: ఈరవత్రి అనిల్

image

వర్గపోరును ప్రోత్సహిస్తే ఇక నుంచి ఊరుకునేది ప్రసక్తే లేదని, అందరూ కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేయాలనిTGMDC ఛైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. వేల్పూర్ AMC నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడారు. పదేళ్లుగా పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలకు పదవులు వస్తుంటే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గుర్తిస్తుందన్నారు.

News October 7, 2024

KMR: ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వహించాలని CMO సీనియర్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. KMR కలెక్టరేట్‌లో కలెక్టర్, సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు క్రింద ఫ్యామిలీ డిజిటల్ కార్డు నిర్వహిస్తున్నామని, ప్రతీ కుటుంబం సమాచారాన్ని సేకరించాలన్నారు. ధాన్యం సేకరణపై ఆయన సమీక్షించారు.