News August 27, 2024

SRSP అప్డేట్.. 58.709 TMCలకు చేరిన నీటిమట్టం

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు (80.5TMC)గాను మంగళవారం రాత్రి 7 గంటలకు 1084.6 అడుగులకు (58.709 TMC) నీటిమట్టం చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాగా 24,014 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా వస్తోందని ఔట్ ఫ్లోగా 4,459 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని చెప్పారు.

Similar News

News October 15, 2025

PCC చీఫ్ సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడాలి: MP

image

రాష్ట్ర PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ROB నిధులపై సరైన అవగాహన లేదని, ముందుగా సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలని నిజామాబాద్ MP అరవింద్ ధర్మపురి సూచించారు. బుధవారం MP మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం BJPపై బురద జల్లి BRSను కాపాడే ప్రయత్నం చేస్తుందని, కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వమే కమిటీ వేసి అవకతవకలు ఉన్నాయని తేలినా ఏమి చేయలేదన్నారు.

News October 15, 2025

నిధులు ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తా: MP

image

NZB జిల్లాలోని ROBలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుంటే వారంలో నిరాహార దీక్ష చేపడుతానని MP ధర్మపురి అర్వింద్ ప్రకటించారు. BJP జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. అడవి మామిడిపల్లి ఆర్ఓబీకి రూ.22 కోట్లు అవసరమైతే, కొన్ని ఏళ్ల క్రితమే సుమారు రూ.18 కోట్లు డిపాజిట్ చేయగా గత ప్రభుత్వం నిధులను మళ్లించిందన్నారు. మాధవ్ నగర్ ఆర్ఓబీకి కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 70% వచ్చాయన్నారు.

News October 15, 2025

NZB: మీ పశువులకు టీకాలు వేయించండి

image

జిల్లాలో గేదెలు, దూడలు, ఆవులు, లేగలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను నేటి నుంచి నవంబర్ 14 వరకు ఉచితంగా వేయనున్నట్లు జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ రోహిత్‌ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఉన్న 1.97 లక్షల పశువులకు ఏడో విడతలో భాగంగా నెల రోజుల పాటు గ్రామాల్లో ఉచితంగా టీకాలు వేస్తారని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువులకు టీకాలు వేయించాలని కోరారు.