News August 22, 2025
SRSP 16 వరద గేట్ల ఓపెన్

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 98% నిండటంతో గురువారం అర్ధరాత్రి 12 గంటలకు మళ్లీ 16 వరద గేట్లు ఓపెన్ చేశారు. వాటి ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 75,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో తాజాగా 1,090.8 అడుగుల (79.658TMC) నీటి మట్టం ఉన్నట్లు అధికారులు వివరించారు.
Similar News
News March 25, 2026
టీడీపీ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరైన ఏపీ, టీజీ సీఎంలు

AP: టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వైదీప్తి వివాహానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. గుంటూరులో జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేర్వేరుగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఏపీ ఐటీ మంత్రి లోకేశ్తో రేవంత్ ముచ్చటించారు.
News March 25, 2026
టీడీపీ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరైన ఏపీ, టీజీ సీఎంలు

AP: టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వైదీప్తి వివాహానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. గుంటూరులో జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేర్వేరుగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఏపీ ఐటీ మంత్రి లోకేశ్తో రేవంత్ ముచ్చటించారు.
News March 25, 2026
అల్లూరి జిల్లాలో ఒకప్పటి నియోజకవర్గం మళ్లీ వస్తుందా?

శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అల్లూరి జిల్లాలో ఒకప్పటి చింతపల్లి నియోజకవర్గం ప్రస్తుతం పాడేరు నియోజకవర్గంలో విలీనం చేశారు. అప్పటి చింతపల్లి నియోజకవర్గంలో జికేవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాలతో పాటు మైదాన మండలాలైన నాతవరం గొలుగొండలలోని గిరిజన గ్రామాలు ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజనలో మళ్ళీ చింతపల్లి నియోజకవర్గం వస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


