News November 21, 2025
SRSP: 947.474 TMCల వరద

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఈ ఏడాది జూన్ 1 నుంచి నేటి వరకు 947.474 TMCల వరద వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రాజెక్టు నుంచి 879.761 TMCల అవుట్ ఫ్లో కొనసాగిందన్నారు. కాగా గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి యావరేజ్గా 3,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు వివరించారు.
Similar News
News February 15, 2026
NZB: ఆ ఐదుగురిలో మేయర్ ఎవరో?

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి 17 మంది కార్పొరేటర్లు గెలువగా అందులో ఐదుగురు మహిళలున్నారు. వారిలో 21వ డివిజన్ నుంచి గెలుపొందిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్ ఉమారాణి, 12వ డివిజన్ దుమాలే అరుంధతి, 9వ డివిజన్ కేతావత్ సురేఖ, 41వ డివిజన్ పూజిత ప్రవీన్ గౌడ్లో ఒకరికి మేయర్ పదవి దక్కే అవకాశాలున్నాయి.
News February 15, 2026
NZB: అక్కడ పోలీసులకు ఏం పని? : MP అర్వింద్

BRS కార్పొరేటర్ ఇంటి దగ్గర మీ ACP, నలుగురు SI లు ఏం చేస్తున్నారు?, అక్కడ వారికి ఏం పని’ అని MP అర్వింద్ ధర్మపురి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BRS కార్పొరేటర్ను ఎత్తుకెళ్లేందుకు సాయం చేస్తున్నారా గడ్డి మేపుతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్కు సేవ చేసేందుకు ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News February 15, 2026
NZB: 500 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం

నిజామాబాద్ నగరంలో ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందన ఈ దేవాలయంలోని శివలింగం స్వయంభూగా భావిస్తారు. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగం నిత్యం విశేష పూజలందుకుంటుంది. రథసప్తమి రోజున సూర్య కిరణాలు నేరుగా శివలింగంపై పడటం ఇక్కడి ప్రత్యేకత. శివరాత్రి పర్వదినాన్ని ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు.


