News March 22, 2025

SSR-దిశ డెత్ కేసు: మాజీ CM కుమారుడి టెన్షన్

image

SSR-దిశా సాలియాన్ డెత్ కేసుల్లో మహారాష్ట్ర మాజీ CM ఉద్ధవ్ ఠాక్రే కొడుకు, MLA ఆదిత్య ఠాక్రే చక్రవ్యూహంలో చిక్కుకున్నారు. దిశది సూసైడ్ కాదని, మర్డర్ చేశారని తండ్రి సతీశ్ ఆరోపిస్తున్నారు. 2020, JUNE 8న ఆమె మరణించినప్పుడు తనను కొందరు మెంటల్ కస్టడీలోకి తీసుకొని నోరు మూయించారని చెప్పారు. ఆదిత్యకు కేసుతో సంబంధం ఉందని, ఆయన సాక్ష్యాధారాలను మాయం చేశారని ఆరోపించారు. ఆ రోజు ఎక్కడున్నారో ఆదిత్య చెప్పడం లేదు.

Similar News

News October 24, 2025

బస్సు ప్రమాదంపై CM చంద్రబాబు తీవ్ర విచారం

image

AP: కర్నూలులో బస్సు <<18087215>>ప్రమాదంపై <<>>దుబాయ్ పర్యటనలో ఉన్న CM చంద్రబాబుకు అధికారులు సమాచారమిచ్చారు. ఘటనలో పలువురు చనిపోవడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయకచర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు. గాయాలతో బయటపడినవారిలో జస్మిత, అకీర, రమేశ్, జయసూర్య, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్, నవీన్ కుమార్, అఖిల్, సత్యనారాయణ, శ్రీలక్ష్మి ఉన్నారు. వీరు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News October 24, 2025

ఇవాళ లేదా రేపు టెట్ నోటిఫికేషన్!

image

ఏపీలో టెట్ నోటిఫికేషన్ ఇవాళ లేదా రేపు విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుద్యోగులతో పాటు ప్రభుత్వ టీచర్లు టెట్ పరీక్ష రాయనున్నారు. 2011కు ముందు టీచర్లుగా నియామకమైన అందరూ టెట్ అర్హత సాధించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగంలో కొనసాగాలన్నా, ప్రమోషన్ రావాలన్నా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి.

News October 24, 2025

శివాలయంలో లింగాన్ని ఎలా దర్శించుకోవాలి?

image

శివాలయంలో శివలింగాన్ని నేరుగా దర్శించకూడదని పండితులు చెబుతున్నారు. ముందుగా నందీశ్వరుడిని పూజించాలని సూచిస్తున్నారు. ‘నంది కొమ్ములపై చూపుడు, బొటన వేలును ఆనించి, ఆ మధ్యలో నుంచి గర్భాలయంలోని లింగాన్ని చూడాలి. దీన్ని శృంగ దర్శనం అంటారు. ఈ దర్శనం అయ్యాకే గర్భాలయం లోపలికి వెళ్లి శివ లింగాన్ని నేరుగా దర్శించుకోవాలి’ అని వివరిస్తున్నారు. ☞ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ వెళ్లండి.