News February 17, 2025

SSS: ఈ ఎద్దు ఖరీదు రూ.1.25 లక్షలు 

image

రైతులు సాగు చేయడానికి ఎద్దుల ఖరీదు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముదిగుబ్బ మండలం హుస్సేన్ పురం గ్రామానికి చెందిన పూజారప్పగారి నాగార్జున ఒక ఎద్దును రూ. 1.25 లక్షల పెట్టి ఆదివారం కొనుగోలు చేసినట్లు వివరించారు. ఇంటిదగ్గర ఒక ఎద్దు ఉండడంతో దాని జత కోసం గుత్తి సమీపంలోని రామరాజుపల్లికి వెళ్లి కొనుగోలు చేసినట్లు రైతు పేర్కొన్నారు. ఈ ఎద్దును చూడడానికి గ్రామస్థులు ఆసక్తిగా తరలి వస్తున్నారు.

Similar News

News January 10, 2026

ఫైనల్లో నిఖత్, హుసాముద్దీన్

image

జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు బాక్సర్లు నిఖత్ జరీన్(51 కేజీలు), హుసాముద్దీన్(60 కేజీలు) ఫైనల్‌కు దూసుకెళ్లారు. సెమీస్‌లో నిఖత్ 4-1 తేడాతో కుసుమ్ బఘేల్‌ను చిత్తు చేశారు. ఫైనల్లో ఆమె 2023 వరల్డ్ ఛాంపియన్ నీతూ గంగ్వాస్‌ను ఎదుర్కోనున్నారు. రామన్‌పై హుసాముద్దీన్ 4-1 తేడాతో గెలిచి ఫైనల్ బౌట్‌కు సిద్ధమయ్యారు. ఇక యంగ్ బాక్సర్ జాదుమణి సింగ్ సీనియర్ బాక్సర్‌ అమిత్ పంఘాల్‌కు షాకిచ్చి ఫైనల్ చేరారు.

News January 10, 2026

చలికాలంలో పురుగుల ఉద్ధృతి తగ్గించడానికి సూచనలు

image

చలికాలంలో పంటలో పురుగుల ఉద్ధృతిని తగ్గించడానికి ఎకరా పొలానికి 25 నీలిరంగు, 10 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చాలి. దీంతో పురుగులు ఆ అట్టలకు అతుక్కొని చనిపోతాయి. పొలంపై కలుపును తొలగించాలి. తోట చుట్టూ 3-4 వరుసల్లో జొన్న, మొక్కజొన్న పంటలను వేయాలి. ఇవి బయట నుంచి వచ్చే పురుగుల నుంచి పంటను కాపాడతాయి. పంట పూతను కాపాడటానికి పూలపై వేపనూనే స్ప్రే చేయాలి. ఇవి చేదుగా ఉండటం వల్ల పురుగులు పువ్వుల జోలికి రావు.

News January 10, 2026

అనంతపురంలో చిరంజీవి సినిమా టికెట్ ₹1,15,000

image

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా టికెట్లను అనంతపురంలో మెగా అభిమానులు రికార్డు ధరకు దక్కించుకున్నారు. నగరంలోని త్రివేణి థియేటర్ వద్ద నిర్వహించిన వేలం పాటలో మొదటి టికెట్‌ను తేజ రాయల్ అనే అభిమాని రూ.1,15,000లకు దక్కించుకున్నారు. రెండో టికెట్ ఇమామ్ హుస్సేన్‌ రూ.30,000, మూడో టికెట్ ధరాజ్ బాషాకు రూ.10,000లకు దక్కించుకున్నారు. జనవరి 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.