News April 1, 2025
SSS: జిల్లా వ్యాప్తంగా 93.31 శాతం పింఛన్ల పంపిణీ

జిల్లాలో మంగళవారం 93.31 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ నరసయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం పింఛనుదారులు 2,62,702 మంది ఉన్నారన్నారు. మొదటి రోజు పింఛన్ దారులకు రూ. 2,79,6000 కోట్లు పంపిణీ చేశామన్నారు. మిగిలిన వారికి బుధవారం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారన్నారు.
Similar News
News July 8, 2025
క్రికెట్ ఇండోర్ స్టేడియంలో ఎందుకు ఆడరు?

క్రికెట్ పిచ్, ఔట్ ఫీల్డ్, భారీ సంఖ్యలో వచ్చే ప్రేక్షకులకు ఇండోర్ స్టేడియం సరిపోదు. పిచ్, బౌలింగ్లో స్వింగ్, సీమ్ వాతావరణ మార్పులను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని దేశాల్లో ఇండోర్ క్రికెట్ ఆడుతున్నారు. అయితే వాటి రూల్స్ భిన్నంగా ఉంటాయి. ICC మాత్రం అధికారికంగా ఇలాంటి మ్యాచ్లు నిర్వహించట్లేదు. పైకప్పును బంతి తాకితే దాన్ని ఎలా పరిగణించాలనే విషయంలో గందరగోళం కూడా దీనికి కారణం.
News July 8, 2025
HYD: GHMC హెడ్ ఆఫీస్లో 2.5 టన్నుల ఈ-వేస్ట్ తొలగింపు..!

స్వచ్ఛ్ భారత్ మిషన్లో భాగంగా HYD జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లోని ఐటీ విభాగం నుంచి 2.5టన్నుల ఈ-వేస్ట్ను అధికారులు తొలగించారు. ఇందులో పాత కంప్యూటర్లు, ప్రింటర్లు, కార్ట్రిడ్జీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఈ-వేస్ట్ను ఆసియాలోనే మొదటి LEED ప్లాటినమ్-సర్టిఫైడ్ ఫెసిలిటీ అయిన దుండిగల్ వద్దకు తరలించారు. ఇక్కడే రీసైకిలింగ్ జరుగుతుందని తెలిపారు.
News July 8, 2025
NZB ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా కృష్ణ మోహన్

నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా డాక్టర్ కృష్ణ మోహన్ను నియమిస్తూ వైద్య ఆరోగ్య, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం మహేశ్వరం మెడికల్ కళాశాలలో జనరల్ సర్జన్గా పని చేస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా డాక్టర్ శివ ప్రసాద్ కొనసాగుతున్నారు.