News April 10, 2025

SSS: మెగా డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తులు చేసుకోండి

image

బీసీ ఎస్సీ ఎస్టీ ఈ డబ్ల్యూ ఎస్ విద్యార్థులు మెగా డీఎస్సీ ఉచిత ఆన్‌లైన్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారిక అధికారి నిర్మల జ్యోతి ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. టెట్‌లో అర్హత సాధించిన సత్యసాయి జిల్లా విద్యార్థులు అర్హులని ఆమె తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 24/7 క్లాసులు అందుబాటులో ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Similar News

News November 14, 2025

Leading: ఎన్డీయే డబుల్ సెంచరీ

image

బిహార్‌లో అద్వితీయ విజయం దిశగా ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం 200 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎంజీబీ కేవలం 37 స్థానాల్లోపే లీడ్‌లో ఉంది. మరోవైపు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ పార్టీ 91 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. జేడీయూ 81, ఆర్జేడీ 28 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.

News November 14, 2025

సంచలనం.. రికార్డు సృష్టించిన నవీన్ యాదవ్

image

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సంచలనం సృష్టించారు. మెజారిటీలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, విష్ణు రికార్డును బ్రేక్ చేశారు. ఇదివరకు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ రికార్డు 2009లో విష్ణు(కాంగ్రెస్) పేరిట ఉంది. ఆయన 21,741 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తాజా ఉపఎన్నికలో నవీన్ యాదవ్ దాదాపు 25వేల ఓట్ల మెజారిటీతో గెలిచి ఆ రికార్డును బ్రేక్ చేశారు.

News November 14, 2025

PDPL: శాండ్ రీచ్‌లను ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం

image

పెద్దపల్లి జిల్లాలోని 19 శాండ్ రీచ్‌లు ఆగిపోవడంతో ప్రభుత్వం ఏడాదికి రూ.200 కోట్ల ఆదాయం కోల్పోతుంది. సహజ సంపదను తోడేయడంతో జీవవైవిధ్యం దెబ్బతింటుందంటూ మానేరు పరివాహక పరిరక్షణ సమితి NGTని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన NGT.. శాండ్ రీచ్‌లను నిలిపివేయాలని కలెక్టర్‌కు 2023లో ఆదేశాలు జారీచేసింది. అయితే ఈనెలలో NGT స్టేను వెకేట్ చేసి రీచ్‌లను ఓపెన్ చేసి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.