News March 13, 2025
₹ చిహ్నం తొలగింపుతో TN పరువు తీసిన స్టాలిన్: అన్నామలై ఫైర్

భారత్లో TN హాస్యాస్పదంగా మారిపోయిందని ఆ రాష్ట్ర BJP చీఫ్ అన్నామలై అన్నారు. హిందీకి వ్యతిరేకంగా DMK, CM స్టాలిన్ మూర్ఖత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రూపీ సింబల్ తొలగించి తమిళ పదం పెట్టడంపై ఘాటుగా స్పందించారు. ‘రూపీ చిహ్నం రూపొందించింది తమిళుడైన ఉదయ్. ఆయన తండ్రి 1971లో DMK MLA. తమిళుడు రూపొందించిన ఈ చిహ్నాన్ని దేశం సగర్వంగా స్వీకరించింది. ఇప్పుడు స్టాలిన్ వల్ల పరువు పోతోంది’ అని అన్నారు.
Similar News
News March 13, 2025
రేపు సెలవు.. ఎల్లుండి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో ‘హోళీ’ సందర్భంగా రేపు విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. ఎల్లుండి నుంచి విద్యార్థులకు ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సా.5 గంటల వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు ఉంటాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ప్రకటించనున్నారు.
News March 13, 2025
వాకింగ్ సమయంలో కుక్కల దాడి నుంచి తప్పించుకోండిలా!

వీధికుక్కల దాడి నుంచి సురక్షితంగా ఉండటానికి ఇలా చేయడం మంచిది. వీధి కుక్కలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వాకింగ్ చేయకండి. కుక్కలు లేవని నిర్ధారించుకున్నాకే ఒంటరిగా వాకింగ్ చేయడం ఉత్తమం. తోటి వాకర్స్తో రన్నింగ్/వాకింగ్ చేయడం మంచిది. కుక్కలు మీ పళ్లను/ నవ్వును చూసినట్లయితే ఆందోళనకు గురై దాడి చేయొచ్చు. వీధి కుక్కలకు ఒకవేళ ఆహారం పెడితే రెగ్యులర్గా పెట్టాలి. లేదంటే అవి మీకు ముప్పు కలిగించవచ్చు.
News March 13, 2025
ఎవరు తలుపు కొడతారోనని భయపడేదాన్ని: హీరోయిన్

ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో సేఫ్టీ విషయంలో చాలా కష్టపడ్డానని బాలీవుడ్ నటి దియా మీర్జా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎప్పుడు ఎవరు తలుపు కొడతారోనని భయంతో మేకప్ ఆర్టిస్ట్ను ఎప్పుడూ సాయంగా ఉంచుకునేదాన్ని. ఇతర హీరోయిన్ల తలుపులు చాలామంది కొట్టి ఉంటారు. నేను అప్పటికే అందాల పోటీ గెలవడం వల్ల, ఫేమస్ కావడంతో అంత త్వరగా ఎవరూ మిస్బిహేవ్ చేయలేదు’ అని పేర్కొన్నారు.