News January 29, 2025
కుంభమేళాలో తొక్కిసలాట.. యూపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు

మహా కుంభమేళా తొక్కిసలాట కలచివేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నిర్వహణ లోపం, సామాన్య భక్తులను వదిలేసి వీఐపీలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోనే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా మేల్కోవాలని హితవు పలికారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
Similar News
News February 4, 2026
‘యానిమల్ పార్క్’ సినిమా షూటింగ్ అప్డేట్

వచ్చే ఏడాది జూన్ లేదా జులైలో ‘యానిమల్ పార్క్’ సినిమా షూటింగ్ను ప్రారంభిస్తామని డైరెక్టర్ సందీప్ వంగా వెల్లడించారు. ఒకే విధంగా కనిపించే ఇద్దరు బ్రదర్స్ మధ్య జరిగే వార్ను ఇందులో చూపెట్టబోతున్నట్లు చెప్పారు. రన్ విజయ్, అజీజ్ పాత్రల మధ్య జరిగే ఘర్షణే ఈ సినిమా అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం సందీప్ ‘స్పిరిట్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. అటు రణ్బీర్ ‘రామాయణ’, ‘లవ్&వార్’ సినిమాలు చేస్తున్నారు.
News February 4, 2026
మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ: మంత్రి

AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్లాగ్ పోస్టులను మార్చిలోపు భర్తీ చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. అదే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణకు జిల్లాకో అధికారిని నియమించాలని సూచించారు. ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వెలగపూడి సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
News February 4, 2026
చిక్కుల్లో ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం

ఆర్మీ మాజీ చీఫ్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటివరకూ పబ్లిష్ కాని ఈ బుక్ కాపీ రాహుల్ గాంధీ చేతిలో కనిపించడంతో వివాదం మరింత ముదిరింది. చైనాతో ఉద్రిక్తతలపై ఇందులో రాశారని రాహుల్ ఆరోపిస్తున్నారు. ప్రచురించని పుస్తకంలో ఉన్న వాటిని లేవనెత్తడం దేశ భద్రతకు ముప్పని కేంద్రం అంటోంది. రక్షణ శాఖ అనుమతులు రాకపోవడంతో 2023 నుంచి ఇది ప్రచురణ కాలేదు.


