News January 29, 2025
నిర్వహణ లోపం వల్లే తొక్కిసలాట: అఖిలేశ్ యాదవ్

మహా కుంభమేళాలో తొక్కిసలాటలో భక్తులు మరణించడం చాలా బాధాకరం అని ఎంపీ అఖిలేశ్ యాదవ్ అన్నారు. నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించాలన్నారు. ఈ ఘటన నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని భక్తుల కోసం వసతి, భోజనం, నీటి సౌకర్యాలకు అదనపు ఏర్పాట్లు చేయాలని ట్వీట్ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Similar News
News January 21, 2026
విస్కీలకు ర్యాంకులు! లిస్ట్లో ఇండియన్ బ్రాండ్!!

ప్రపంచంలో విస్కీలకు ర్యాంకింగ్స్ ఇచ్చే జిమ్ ముర్రే విస్కీ బైబిల్ 2025-26 రిలీజైంది. ఇందులో World Whiskey of the year టైటిల్ USAకు చెందిన ఫుల్ ప్రూఫ్ 1972 బౌర్బన్, టాప్ సింగిల్ మాల్ట్ స్కాచ్గా గ్లెన్ గ్రాంట్, రెడ్బ్రెస్ట్, భారత్కు చెందిన పాల్ జాన్ ఉన్నాయి. ఇక కర్ణాటకకు చెందిన అమృత్ డిస్టిలరీస్ Expedition (15Y. old Single Malt) మోస్ట్ ఫైనెస్ట్ విస్కీ ర్యాంక్3ని పొందింది. దీని ధర రూ.10 లక్షలు.
News January 21, 2026
పిల్లలు బరువు కాదు.. భవిష్యత్తు!

US ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఉష దంపతులు నాలుగో <<18911938>>బిడ్డకు<<>> జన్మనివ్వనుండటం చర్చకు దారితీసింది. ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ తమ దేశ ప్రజలకు ఇలా సందేశం ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. పిల్లల్ని బరువుగా కాకుండా భవిష్యత్తుగా భావించాలని అక్కడి ప్రభుత్వాల సూచన. అయితే మన దేశంలోనూ ఎక్కువ మంది పిల్లల్ని కనాలని రాజకీయ నేతలు చెబుతున్నా ఆర్థిక స్తోమత లేదని మధ్యతరగతి ప్రజలు అంటున్నారు. మీ COMMENT
News January 21, 2026
ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ

అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం డాలర్తో కంపేర్ చేస్తే రూ.91.74కు సమానంగా ఉంది. అమెరికా-గ్రీన్లాండ్ ఉద్రిక్తతల నడుమ భారతీయ ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడిదారులు నిరంతరం అమ్మకాలు జరిపారు. దీంతో మార్కెట్లు కుదేలై రూపాయి పతనం వైపు నడిచింది. అటు 2026లో రూపాయి విలువ 1.98% మేర పడిపోయింది. ఆసియాలో పతనమైన కరెన్సీలో ఇది రెండో ప్లేస్లో ఉంది.


