News February 17, 2025

ఢిల్లీలో తొక్కిసలాట.. రైల్వేశాఖ అప్రమత్తం

image

ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో రద్దీ నియంత్రణకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. న్యూఢిల్లీతో పాటు ప్రయాగ్‌రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లక్నో, మిర్జాపూర్ రైల్వే స్టేషన్లలో GRP, RPF పోలీసులను భారీగా మోహరించారు. స్టేషన్ బయటే ప్రయాణికుల రద్దీని నియంత్రిస్తున్నారు. వాహనాలను స్టేషన్ల సమీపంలోకి అనుమతించడంలేదు. రైలు వచ్చాక ప్లాట్‌ఫాంపైకి ప్రయాణికులను అనుమతిస్తున్నారు.

Similar News

News December 29, 2025

సూపర్ నేపియర్ గడ్డిని ఎలా పెంచాలి?

image

పశుగ్రాసం కొరతను తగ్గించి, పాడి పశువులకు ఎక్కువ పోషకాలను అందించే గడ్డి సూపర్ నేపియర్. దీన్ని చౌడు నేలలు మినహా ఆరుతడి కలిగిన అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. దీని సాగుకు ముందు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్పేట్, 20kgల నత్రజని, 10kgల పొటాష్ వేయాలి. భూమిని మెత్తగా దున్ని, ప్రతీ 3 అడుగులకొక బోదెను ఏర్పాటు చేసి, ఎకరాకు 10 వేల కాండపు కణుపులు లేదా వేరు పిలకలు నాటుకోవాలి.

News December 29, 2025

మహిళలు పుట్టుకతోనే నాయకులు: ఈషా అంబానీ

image

నాయకత్వ స్థానాలకు పురుషులతో పాటూ స్త్రీలూ సమానంగా న్యాయం చేయగలరంటున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ ఈషా అంబానీ. “అయితే కెరీర్​లో పురుషుల ఎదుగుదలతో పోలిస్తే మహిళల ఎదుగుదల చాలా కష్టం. మగవాళ్ల కంటే మహిళలు నాయకత్వంలో ముందుంటారని నేను వ్యక్తిగతంగా నమ్ముతా. మహిళలు పుట్టుకతోనే నాయకులు. మహిళల్లో ఉండే నిస్వార్థమైన మనసు వారిని మంచి నాయకులుగా తీర్చిదిద్దుతుంది” అని ఈషా తెలిపారు.

News December 29, 2025

శివాలయానికి వెళ్తున్నారా?

image

శివాలయంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ‘ప్రదోష కాల దర్శనం గ్రహ దోష నివారణకు శ్రేష్ఠం. గణపతి దర్శనానంతరం లింగాన్ని దర్శించాలి. నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూడటం మర్వకూడదు. శివునికి అర్చించిన ప్రసాదం, విభూతి, పూలను నందిపై ఉంచరాదు. సోమసూత్రాన్ని దాటకుండా ప్రదక్షిణలు చేయాలి’ అంటున్నారు. శివాలయంలో ‘చండీ ప్రదక్షిణ’ ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.