News February 17, 2025

ఢిల్లీలో తొక్కిసలాట.. రైల్వేశాఖ అప్రమత్తం

image

ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో రద్దీ నియంత్రణకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. న్యూఢిల్లీతో పాటు ప్రయాగ్‌రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లక్నో, మిర్జాపూర్ రైల్వే స్టేషన్లలో GRP, RPF పోలీసులను భారీగా మోహరించారు. స్టేషన్ బయటే ప్రయాణికుల రద్దీని నియంత్రిస్తున్నారు. వాహనాలను స్టేషన్ల సమీపంలోకి అనుమతించడంలేదు. రైలు వచ్చాక ప్లాట్‌ఫాంపైకి ప్రయాణికులను అనుమతిస్తున్నారు.

Similar News

News September 19, 2025

పండగ సంతోషం లేకుండా చేయడమేనా ప్రజాపాలన: హరీశ్

image

TG: దసరా స్పెషల్ బస్సుల్లో టికెట్ రేట్లు <<17756948>>సవరించడంపై<<>> BRS నేత హరీశ్‌రావు ఫైరయ్యారు. ‘పండుగలు వస్తే పల్లె వెలుగు సహా అన్ని రకాల బస్సుల్లో ధరలు విపరీతంగా పెంచి ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం. అదనపు సర్వీసుల పేరిట 50% అదనంగా దోపిడీ చేస్తున్నారు. ప్రజలకు బతుకమ్మ, దసరా సంతోషం లేకుండా చేయడమేనా ప్రజాపాలన? ఇదేనా ప్రభుత్వ వైఖరి?’ అని ప్రశ్నించారు.

News September 19, 2025

APPLY: బీటెక్ అర్హతతో 119 ఉద్యోగాలు

image

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో 119 జూనియర్ ఎగ్జిక్యూటివ్(కాంట్రాక్ట్) పోస్టులకు ఈ నెల 26 వరకు <>అప్లై చేసుకోవచ్చు.<<>> 60% మార్కులతో B.Tech/B.E, M.A, CA, MBA పూర్తిచేసిన వారు అర్హులు. వయసు 29 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. తొలి ఏడాది ప్రతి నెలా ₹35K, రెండో ఏడాది ₹37,500, మూడో ఏడాది ₹40K, నాలుగో ఏడాది ₹43K జీతం ఉంటుంది.
#ShareIt

News September 19, 2025

71ఏళ్ల వయసులో స్కైడైవింగ్ చేసిన వృద్ధురాలు

image

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని కేరళకు చెందిన 71 ఏళ్ల లీలా జోస్ నిరూపించారు. ఇడుక్కి జిల్లా, కొన్నతడికి చెందిన లీలకు స్కైడైవింగ్ చేయాలని కోరిక. తాజాగా దుబాయ్ వెళ్లిన ఆమె అనుభవజ్ఞుడైన శిక్షకుడితో కలిసి 13,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేశారు. కేరళలో ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. ‘గాల్లో తేలిపోతున్నప్పుడు భయం, ఆనందం రెండూ కలిగాయి.’ అని లీల తన అనుభవాన్ని వివరించారు.