News January 9, 2025
తొక్కిసలాట ఘటన.. 40 మంది డిశ్చార్జ్

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ 40 మందిని డిశ్చార్జ్ చేశామని అధికారులు తెలిపారు. 48 మంది అస్వస్థతకు గురయ్యారని, వారికి రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందించామని చెప్పారు. వారిలో 40 మందిని డిశ్చార్జ్ చేయగా, మరో 8 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. సీఎం చంద్రబాబు నేడు తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు.
Similar News
News January 24, 2026
కలెక్షన్స్లో ధురంధర్ను దాటేసిన బార్డర్-2

సన్నీ డియోల్ నటించిన ‘బార్డర్-2’ ఫస్ట్ డే ఇండియా(హిందీ) కలెక్షన్లలో ఆల్ టైమ్ హిట్ ‘ధురంధర్’ రికార్డును బ్రేక్ చేసింది. Sacnilk.com ప్రకారం.. ధురంధర్ మొదటి రోజు ₹27 కోట్లు (నెట్) వసూలు చేయగా, బార్డర్-2 ఏకంగా ₹30 కోట్లు రాబట్టి సత్తా చాటింది. అయితే ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లలో మాత్రం ధురంధర్ (₹41.5 కోట్లు) కంటే బార్డర్-2 (₹41 కోట్లు) స్వల్పంగా వెనుకబడి ఉంది.
News January 24, 2026
2014 నుంచి విచారణ చేయిద్దాం: భట్టి

TG: సింగరేణి టెండర్లపై విచారణకు సిద్ధమని, 2014 నుంచి జరిగిన టెండర్లపై విచారణ చేయిద్దామని Dy.CM భట్టి అన్నారు. ‘హరీశ్ రావుకు విచారణ కావాలంటే మాకే లేఖ రాయండి. తాడిచర్ల నుంచి నైనీ వరకు అన్నింటిపై దర్యాప్తు చేయిద్దాం. CM రేవంత్ రాగానే విచారణ కోరతాం’ అని తెలిపారు. తన 40ఏళ్ల ప్రతిష్ఠను కట్టుకథలతో <<18943021>>దెబ్బతీయొద్దన్నారు<<>>. ఆస్తులు కూడబెట్టడానికి కాదు సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.
News January 24, 2026
పశువులకు మేతగా ఉల్లిపాయలతో డేంజర్

ఉల్లికి సరైన ధర లేకపోతే కొందరు రైతులు ఆ పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే N-propyl disulfide అనే రసాయనం పశువుల్లోని ఎర్రరక్తకణాలను విడదీస్తుందని తెలిపారు. దీనివల్ల వాటిలో బలహీనత, కళ్లు, మూత్రం ఎర్రగా మారడం, శ్వాసలో వేగం పెరగడం, కడుపులో వాపు, లక్షణాలు తీవ్రమైతే అవి మరణించే అవకాశం ఉందంటున్నారు.


