News January 9, 2025

తొక్కిసలాట ఘటన.. రెండు కేసులు నమోదు

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో రెండు కేసులు నమోదయ్యాయి. బైరాగిపెట్టెడ వద్ద తొక్కిసలాట ఘటనపై ఈస్ట్‌ పీఎస్‌లో నారాయణపురం ఎంఆర్‌వో, విష్ణు నివాసంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బాలయ్యపల్లె ఎంఆర్‌వో ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి టోకెన్లు జారీ చేసే క్రమంలో పెద్ద ఎత్తున భక్తులు రావడంతో మూడు చోట్ల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు.

Similar News

News November 4, 2025

రోడ్ల నాణ్యతలో రాజీపడొద్దు: Dy.CM పవన్

image

AP: గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం ‘సాస్కి’ పథకం ద్వారా సమకూర్చిన రూ.2 వేల కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని Dy.CM పవన్ కళ్యాణ్ సూచించారు. ‘రహదారుల నాణ్యతలో రాజీపడొద్దు. అధికార యంత్రాంగానిదే బాధ్యత. ప్రమాణాలకు తగ్గట్లు నిర్మిస్తున్నారో లేదో తనిఖీ చేయాలి. నేను, నిపుణులు క్షేత్రస్థాయిలో క్వాలిటీ చెక్ చేస్తాం’ అని చెప్పారు. రోడ్ల విషయంలో గత ప్రభుత్వం అలక్ష్యంతో వ్యవహరించిందని ఆరోపించారు.

News November 4, 2025

భారీ జీతంతో ఆర్మీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఇంజినీరింగ్ పూర్తైన, చివరి సంవత్సరం చదువుతున్నవారు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(TGC)లో చేరేందుకు ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీటెక్ మార్కుల మెరిట్‌తో ఎంపిక చేస్తారు. ఏడాది శిక్షణలో రూ.56,100 స్టైపెండ్ ఇస్తారు. ఆ తర్వాత మొదటి నెల నుంచే రూ.లక్ష వరకు శాలరీ ఉంటుంది. పెళ్లికాని 20-27ఏళ్ల మధ్య ఉన్న పురుషులు అర్హులు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు 30. నవంబర్ 6వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది.

News November 4, 2025

‘ది రాజాసాబ్’ విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ

image

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మూవీ టీమ్ ఖండించింది. ముందుగా ప్రకటించినట్లుగానే సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ తదితరులు నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.