News May 4, 2024
‘బాధితులకు అండగా ఉండండి’.. కర్ణాటక సీఎంకు రాహుల్ లేఖ

ప్రజ్వల్ రేవణ్ణ కేసులోని బాధితులకు అన్ని విధాలా అండగా నిలవాలని కోరుతూ కర్ణాటక CM సిద్ద రామయ్యకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ‘బాధ్యులపై చర్యలు తీసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. మహిళలపై హింస జరుగుతుంటే మౌనం వహించే నేతను నేనెప్పుడూ చూడలేదు. ప్రధాని మోదీ నేరస్థులకు ఇస్తున్న మద్దతుతో హరియాణాలోని రెజ్లర్ల నుంచి మణిపుర్లోని అక్కచెల్లెళ్ల వరకు భారతీయ మహిళలందరూ బలవుతున్నారు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 8, 2025
ఇది రాజమౌళి మార్క్ కాదు.. పోస్టర్పై ఫ్యాన్స్ నిరాశ

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB 29 సినిమా నుంచి నిన్న విడుదలైన పోస్టర్ నిరాశపరిచిందని ఫ్యాన్స్ అంటున్నారు. విలన్ పృథ్వీ సుకుమారన్ వీల్ ఛైర్లో కూర్చున్నట్లు ఆ పోస్టర్ ఉంది. అయితే గతంలో వచ్చిన సూర్య ’24’లో అచ్చం ఇదే లుక్ ఉందని, ఇది రాజమౌళి మార్క్ కాదని పోస్టులు చేస్తున్నారు. చూడ్డానికి AI జనరేటెడ్ పిక్లా ఉందంటున్నారు. మరి ఈ పోస్టర్ మీకు నచ్చిందా? కామెంట్ చేయండి.
News November 8, 2025
NEEPCLలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News November 8, 2025
ఉప్పుడు బియ్యానికి అనుకూలమైన వరి రకం

ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సాగు చేసే రకం M.T.U 3626(ప్రభాత్). ఈ వరి రకం పంట కాలం 120 నుంచి 125 రోజులు. గింజ పొడవు మరియు ముతక రకం. ఈ రకం చేనుపై పడిపోదు. అగ్గి తెగులును తట్టుకుంటుంది. M.T.U 3626 వరి రకం ఉప్పుడు బియ్యం, నూకకు అత్యంత అనుకూలం. ఎకరాకు 3 నుంచి 3.5 టన్నుల దిగుబడినిస్తుందని వ్యవసాయ నిపుణులు తెలిపారు.


